గడిచిన 4 రోజులుగా ఢిల్లీ శివార్లలో రైతులు తిండి తినకుండా, నీళ్లు తాగకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని మార్గాల్లో బెదిరించినా రైతులు ఏ మాత్రం భయాందోళనకు గురి కాకుండా తమ ఆందోళనను శాంతియుతంగా తెలియజేస్తున్నారు. పోలీసుల నుంచి కష్టపడి అనుమతులు తెచ్చుకుని తమ నిరసనను తెలుపుతున్నారు. అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలి పెడుతున్నా రైతులు అలాగే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించి ఒక దాబా యజమాని తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఆమ్రిక్ సుఖ్దేవ అనే యజమాని అక్కడ ఆకలితో అలమటిస్తూ ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆహారం ఇస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారు. రెండు వేల మంది రైతులకు రెండు రోజులుగా దాబా యజమాని ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దాబా యజమాని ఈ దేశానికి రైతు కంటే ఎవరూ ఎక్కువ ఇవ్వలేదని అన్నారు.
ఎంతమంది రైతులు వచ్చినా కడుపునిండా భోజనం పెడతానని.. వాళ్ల ఆకలి తీర్చడంలో పొందే ఆనందం అంతాఇంతా కాదని దాబా యజమాని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉన్నాడని ఆ రైతుకు తన వంతు సహాయం చేస్తున్నానని దాబా యజమాని తెలిపారు. కడుపునిండా భోజనం పెడుతూ ప్రశంసలు అందుకుంటున్న దాబా యజమానిని అందరూ మెచ్చుకుంటూ ఉండటం గమనార్హం.
‘యూత్ కాంగ్రెస్’ సోషల్ మీడియా ద్వారా ముర్తాల్ దాబాలో రైతులు భోజనం చేస్తున్న దృశ్యలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సింఘు, టిక్రీ ప్రాంతాల్లో రైతులు శాంతియుతంగా తమ నిరసనను తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…