భారతదేశంలో రెండవ దశ కరోనా వ్యాపించిన నేపథ్యంలో రోజురోజుకు వ్యాధి తీవ్రత అధికం అవుతూ ఎంతో మంది మృత్యువాత పడిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టిన మరణాల సంఖ్య అదే స్థాయిలో కొనసాగుతోంది. భారతదేశంలో వ్యాపించిన రెండవ దశ డెల్టా వేరియంట్ ఎంతో ప్రమాదకారిగా మారుతుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో అత్యధికంగా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు గుర్తించారు.
సాధారణంగా కరోనా బారినపడిన వారిలో తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, రుచి వాసన లేకపోవడం అనేటివి సర్వసాధారణ లక్షణాలు. కానీ ఈ వేరియంట్ ప్రభావం వల్ల రోగులలో కనిపించని వినికిడి లోపం, గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తం గడ్డ కట్టడం,గ్యాంగ్రేన్ వంటి లక్షణాలు ఈ వేరియంట్ తో ముడిపడి ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ విధమైన డెల్టా వేరియంట్ ను మొట్టమొదటిసారిగా భారతదేశంలో గుర్తించినప్పటికీ సుమారు 60 దేశాలకు పైగా ఈ వైరస్ పాకడంతో అన్ని ఆ దేశాల మధ్య రాకపోకల పై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఈ వేరియంట్ వల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు తలెత్తడంతో రోజురోజుకు బాధితుల సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం విధించిన లాక్ డౌన్ పై ఆంక్షలు తీసివేయడం పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
ఈ విధమైనటువంటి వేరియంట్ తీవ్రమైన లక్షణాలలో గ్యాంగ్రేన్ తీవ్రమైన కండరాల నొప్పికి దారి తీసినట్లు ముంబయిలోని సెవెల్ హిల్స్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ గణేశ్ మనుధానే అన్నారు. ఈ విధమైనటువంటి గ్యాంగ్రేన్ లక్షణాలతో బాధపడే వారు గత ఏడాది కేవలం 2,3 కేసులను మాత్రమే చూశామని ప్రస్తుతం ఈ కేసులు వారానికి ఒకటి నమోదు అవుతున్నట్లు గణేష్ తెలిపారు. ఈ విధమైనటువంటి లక్షణం మన శరీరంలో రక్తం సరఫరా సరిగా లేకపోవడం వల్ల చర్మ కణజాలం చనిపోయే స్థితిని తెలియజేస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…