Movie News

ఇదెక్కడి సాంప్రదాయ…కర్రలతో కొట్టుకున్నారు.. 100 మందికిపైగా గాయాల పాలయ్యారు..!

విజయదశమి సందర్భంగా అక్కడ సంప్రదాయంగా వస్తున్న పద్ధతి కర్రలతో సమరం. ఈ సారి అక్కడ హింస చెలరేగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. 9 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. శుక్రవారం అర్థరాత్రి ఈ సమరం ప్రారంభమైంది.

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జైత్రయాత్రలో హింస చెలరేగింది. సుమారు వంద మందికి గాయాలయ్యాయి. స్వామి వార్ల కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అక్కడే ఉన్న కొండపై నుంచి ఉత్సవానికి సంబంధించిన విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు.

ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల భక్తులు.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు ఉండగా.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఒకవైపు ఉండి.. ఇరువురు విడిపోయి కర్రలతో తలపడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు.

ఇటువంటి హింస జరగకూడదని పోలీసులు ముందుగానే పహారా కాశారు. కానీ వాళ్లు ఈ హింసను నిలువరించలేకపోయారు. ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి. దీంతో ఆ ఘటనపై లోకాయుక్తతో పాటు మానవహక్కుల కమిషన్ సీరియస్ అయింది. కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్లెదుటే హింస జరగుతుంటే పోలీసులు నియంత్రించలేకపోయారు అంటూ సీరియస్ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago