Devi sri Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సంగీత దర్శకుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కలర్స్ స్వాతి విషయంలో దేవిశ్రీప్రసాద్ ఎంతో మొండిగా ప్రవర్తించారని తనకి పదేపదే మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ టార్చర్ పెట్టారని తాజాగా ఓ విషయం బయటపడింది.
కలర్స్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైనటువంటి కలర్స్ స్వాతి ఎంతో మంది దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఏకంగా సినిమా అవకాశాలను అందుకుంది ఇలా డేంజర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి సందడి చేశారు.
ఇక ఈమె యాంకర్ గా నటిగా మాత్రమే కాకుండా అద్భుతమైన సింగర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈమె ఎంతో అద్భుతంగా పాటలు పాడుతుంది.ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తనతో పాట పాడించాలని ఆమె కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారట. తనకు పదే పదే మెసేజ్లు పెట్టి ఫోన్ చేసినప్పటికీ ఈమె రెస్పాండ్ కాకపోవడంతో ఏకంగా తన ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.
ఈ విధంగా దేవి శ్రీ ప్రసాద్ స్వాతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి తన సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాలని తాజాగా ఈ విషయం బయటపడింది. ఇంతకీ కలర్స్ స్వాతి పాడిన పాట ఏంటి అనే విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమాలో ఏ స్క్వేర్ , బి స్క్వేర్ అనే పాటను పాడారు. ఈ పాట ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…