Devi Vs Vishwak Sen : టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ల మధ్య వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. సోషియల్ మీడియాలో ఈ వివాదంపై రోజు ఎవరో ఒకరు స్పందించడం తో ఈ వివాదం ఇంకా హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా నుంచి ఈ వీడియో సామాన్య జనాల వరకు చేరింది. అయితే ప్రస్తుతం దేవీ నాగవల్లి విశ్వక్ సేన్ ఇద్దరిలో ముందుగా ఓపిక కోల్పోయింది ఎవరు ముందుగా దూషించింది ఎవరు అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి బాబు గోగినేని పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే..విశ్వక్ – దేవిల ఇద్దరిలో మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం.. చట్టాన్ని ఎవరు మొదట ఉల్లంఘించారు అనే అంశం మీద బాబు గోగినేని ట్వీట్ చేశారు. అయితే ఒక వ్యక్తి మానసిక స్థితి గురించి మనం జడ్జ్ చేయొచ్చా లేదా అని ఆలోచించకుండా మొదటి ఎవరు పర్సనల్ ఎటాక్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
ఎవరు మొదట చట్టాన్ని ఉల్లంఘించారు…….
ప్రస్తుతం మానసిక స్థితి గురించి పర్సనల్ ఎటాక్ గురించి సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ విషయం పరంగా మెంటల్ హెల్త్ యాక్ట్ పై హైకోర్టు న్యాయవాది శ్రీ ప్రమోద్రెడ్డి మాట్లాడుతూ.. లైవ్ టీవీలో డిబేట్ కు ఆహ్వానించి నటుడిని మొదట నిస్పృహ లేదా మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించడం తప్పు .. ఈ విషయంలో టి వి 9 యాంకర్ దేవి నాగవల్లి మొదట చట్టాన్ని ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్య స్థితిని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అలా మాట్లాడటం అనేది అతని గౌరవానికి సంబంధించిందని తెలిపారు. ఒకవేళ నిజంగానే విశ్వక్ సేన్ మానసికంగా ఆరోగ్యాంగా లేకపోతే అతడిని చర్చకు పిలవడం ఉద్దేశపూర్వక నేరానికి నిదర్శనం” అంటూ చెప్పుకొచ్చారు.“మానసిక ఆరోగ్య చట్టాన్ని ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరం అని, ఇలా చేస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉండొచ్చు .” అన్నారు. నెటిజన్లు కూడా ఈ విషయంలో దేవి నాగవల్లి దే తప్పు అని కామెంట్ చేస్తున్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…