Flash Back : హాస్యం అనగానే ఆనాటి నటులయిన రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య లు గుర్తుకొస్తారు.. ఆ తర్వాత తరంలో బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తుకొస్తారు. సంభాషణలు పలకకుండా ముఖ కవలికలతో హాస్యం పుట్టించే అతికొద్ది మంది హాస్యనటుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. బుల్లితెర, వెండితెర అని తేడా లేకుండా తన హాస్యంతో తెలుగు ప్రజలందరినీ అభిమానులుగా ఆయన మార్చుకున్నారు.
దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే “తోక లేని పిట్ట” అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు.
నువ్వు నేను, ధైర్యం చిత్రాలు మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించ పరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యాడు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
1989 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరవాత సాంస్కృతిక మండలి అధ్యక్షడిగా పనిచేశాడు… అయితే ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమాలతో పాటు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చిందని తాను ఎప్పుడూ తామరాకుపై నీటి బిందువుల ఉన్నానేగాని రాజకీయ బురదలోకి దిగలేదని కాంగ్రెస్ లో తనకు వైయస్ రాజశేఖర్ రెడ్డితో సాంగత్యం ఉండేదని 1998-99 ప్రాంతంలో తాను రూపొందించిన యాడ్స్ అదేవిధంగా తాను నటించిన సినిమాలను చూడమని రాజశేఖర్ రెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లే వాడినని కానీ ఆయనకు సినిమాలపై అంతగా ఆసక్తి ఉండేది కాదని ఎప్పుడూ రాజకీయాలు, ప్రజాసమస్యల పట్ల ఎక్కువ దృష్టి సారించే వారని ఆ ఇంటర్వ్యూలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…