Radha Krishna Love story : ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధ కృష్ణులు. రాధ కృష్ణుల ప్రేమ నిస్వార్థ మైన ఆరాధన. ఎన్ని సార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ. అయితే కృష్ణుడు ఎందుకని రాధని పెళ్లి చేసుకోలేదు. వాళ్లిద్దరు ఎందుకని విడిపోయారు. రాధ కృష్ణుడి కంటే వయసులో పెద్దదైనా ఎలా వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సందేహాలు చాలామంది మదిలో ఉండేవే.. కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు, 16,000 మంది గోపికలను ఎందుకు ఉన్నారు అంతమందిని ఎందుకు వివాహం చేసుకున్నారు…
అజరామరమైన ప్రేమ… ఎందుకు పెళ్లి చేసుకోలేదు..
రాధ కృష్ణుడికంటే పెద్దది దీనికి కారణం పురాణాల ప్రకారం మహా విష్ణువు ధర్మస్థాపనకు భూమి మీద శ్రీకృష్ణుడిగా జన్మించాలని అనుకున్న అంతకంటే ముందు లక్ష్మి దేవిని భూమి మీద జన్మించమని బ్రతిమలాగా ఆమె భూలోకంకి మీకంటే ముందే వెళ్లినా మీరు వచ్చే వరకు కళ్ళు తెరవను అని చెప్పి భూలోకం కి వెళ్తుంది. అలా ఒక యాదవుడికి నది పక్కన కలువ పువ్వులో దొరకగా ఆమెను ఆ యాధవ కుటుంబం పెంచుతారు . కానీ ఆమె పెద్దదవుతున్న కళ్ళు తెరవక పోవడంతో ఆందోళనకు గురవ్వుతారు. ఇక శ్రీకృష్ణుడు జననం మనకు తెలుసు. గోకులం మొదటి సారి శ్రీకృష్ణుడిని కలిసాక రాధ కళ్ళు తెరుస్తుంది.
అలా శ్రీకృష్ణుడు, రాధ కంటే చిన్నవాడిగా జన్మిస్తాడు. అలా మొదలైన వారి ప్రేమ కథ నేటికీ మధురంగానే ఉంది. ఇక కృష్ణుడు తాను జన్మించిన కర్తవ్యం కోసం మధుర వెళ్ళాలి అని అనుకున్నపుడు రాధ తనను పెళ్లి చేసుకుని వెంట తీసుకెళ్లామని బ్రతిమలాడినా.. ఆత్మలు ఒకటై జీవిస్తున్న మనకు పెళ్లి అవసరం లేదు అని కృష్ణుడు చెప్పి, మన జన్మల కారణం వేరని మన కర్తవ్యాల దిశగా అడుగులు వేయాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఎనిమిది మంది భార్యలను పెళ్లి చేసుకున్న శ్రీ కృష్ణుడు మళ్ళీ పదహారు వేల మంది గోపికలను పెళ్లి చేసుకోడానికి కారణం.. మేనమామ కంసుడిని వదించిన తరువాత కంసుడి చేరలో ఉన్న పదహారు వేల మంది అమ్మాయిలను విడిపించి వారి కుటుంబం వద్దకు చేర్చగా వారిని స్వీకరించడానికి వారి కుటుంబాలు సిద్ధంగా లేకపోవడంతో కృష్ణుడు వారిని పెళ్లి చేసుకుని ఒక రాజభవనంలో వారిని ఉంచి జీవనం కల్పించాడు. అలా రాధకృష్ణులు దేహాలు వేరే అయిన వారి ఆత్మ ఒకటిగా జీవించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…