Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చంద్ర మహేష్ ఒకరు. ఈయన గతంలో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకుడిగా పని చేశారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర మహేష్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించారు. తాను గతంలో చిరంజీవితో సినిమా చేయాలని కథ సిద్ధం చేసుకుంటూ ఉండగా సురేష్ ప్రొడక్షన్ నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు.
సురేష్ ప్రొడక్షన్ తనకు ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిందని, ఆ ప్రొడక్షన్ లో పని చేయడం కోసం మెగాస్టార్ చిరంజీవికి ఇది పరిస్థితి అని చెప్పి చిరంజీవి సినిమా పక్కనపెట్టి రామానాయుడు గారి దగ్గరికి వెళ్లానని తెలిపారు. వెళ్లగానే నా చేతిలో కొన్ని సీడీలు పెట్టి ఈ సినిమాలన్నీ చూసి ఒక మంచి ఎమోషనల్ కథ ప్రిపేర్ చేయమని చెప్పారు. పోసాని గారితో కలిసి ఎన్ని కథలు సిద్ధం చేసిన ఫస్ట్ హాఫ్ నచ్చితే సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఇలా రెండు మూడు నెలల సమయం వృధా అయింది.
కట్ చేస్తే సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ హీరోగా జయం మనదేరా సినిమా అనౌన్స్ చేశారు.ఒకవైపు చిరంజీవి గారి సినిమా పక్కన పెట్టి అక్కడికి వెళితే సురేష్ ప్రొడక్షన్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు. ఇక ఏం చేయాలో దిక్కుతోచక అందరి దగ్గరికి వెళ్లి అవకాశం అడిగితే కొంత సమయం వేచి ఉండమని చెప్పారు. అలాంటి సమయంలో శ్రీహరి ఒక్కడే సినిమా చేసే అవకాశం వచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న తరువాత తనుకు రెమ్యూనరేషన్ కూడా పెరిగిందని, ఈ సినిమా తర్వాత తనకు మరోసారి రామానాయుడు గారి నుంచి పిలుపు వచ్చిందని తెలిపారు.ఇలా రామానాయుడుగారు నన్ను కలవాలంటే వెళ్లి అతనిని కలిశానని నా చేతిలో ఐదు లక్షలు అడ్వాన్స్ పెట్టి చిరంజీవితో సినిమా చేయాలి అంటూ చెప్పినట్లు చంద్రమహేష్ వెల్లడించారు.
ఇదే విషయం చిరంజీవి దగ్గరికి వెళ్లి చెబితే నేనే నీ పేరు చెప్పాను అంటూ చిరంజీవి అన్నారు. అలా చిరంజీవి గారు నా పేరు చెప్పడంతో ఎంతో సంతోషించి ఆయనకు థాంక్స్ చెప్పి కథ సిద్ధం చేసే పనిలో పడ్డాను. అయితే రామానాయుడు గారికి నేను సిద్ధం చేస్తున్న కథకన్నా రచయిత చిన్ని కృష్ణ సిద్దం చేసిన కథ నచ్చింది.ఇక ఆ కథతో నేను డైరెక్ట్ చేయాలేమో అనుకున్నాను కానీ తీరా చూస్తే దర్శకుడిగా చిన్నకృష్ణ పనిచేస్తారని చెప్పారు. ఇలా మరోసారి కూడా మాకు సినిమా సెట్ అవ్వలేదని చంద్ర మహేష్ వెల్లడించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…