Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన క్రేజ్ కి అనుగుణంగా ఆ సినిమాలో సెలబ్రిటీలను కూడా ఎంపిక చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం పాటు మనుగడ ఉండాలి అంటే ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ వహించాలి ఒక్కసారి షేప్ అవుట్ అవుతే వారికి అవకాశాలు రావడం చాలా గగనం.
అందుకే హీరోయిన్లు ఎక్కువగా ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు జీరో సైజ్ మెయింటెన్ చేస్తూ ఉన్నారా అయితే ఒక్కోసారి ఈ జీరో సైజ్ మంచి మంచి సినిమా అవకాశాలను కూడా కోల్పోయేలా చేస్తుంది. అలా జీరో సైజ్ లో ఉన్నటువంటి రకుల్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రభాస్ సినిమా నుంచి తప్పుకోవడమేంటి అసలు ఏ సినిమా అనే విషయానికి వస్తే.. దశరథ్ దశకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం మిస్టర్ ఫర్ఫెక్ట్. ఈ సినిమాలో ప్రభాస్ కాజల్ అగర్వాల్ తాప్సి హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
కాజల్ అగర్వాల్..
ఇక ఈ సినిమాలో ప్రియా పాత్రలో నటించిన కాజల్ అగర్వాల్ ఎంతో అద్భుతంగా నటించారు.. నిజానికి ఈ పాత్రలో కాజల్ అగర్వాల్ కాకుండా ముందుగా రకుల్ ను ఎంపిక చేశారు. ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే రష్ చూసిన తర్వాత ఆమె చాలా సన్నగా కనిపించడంతో షూటింగ్ ఆపేసి ఆమెను ఈ సినిమా నుంచి తీసేశారు అనంతరం మరొక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టిన నేపథ్యంలో దిల్ రాజు కాజల్ పేరును సూచించారు అయితే అప్పటికే ఈమె డార్లింగ్ సినిమాలో నటించారు. అయినప్పటికీ ప్రభాస్ తో సినిమా అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా ద్వారా మరో హిట్ అందుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…