గత నెల 10 వ తేదీ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలాఉండగా సాయి తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
దాదాపు నెల రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సాయి తేజ్ దసరా పండుగ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరు,పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తేజు క్షేమంగా ఉన్నాడని తెలపడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్న సాయి తేజ్ ను పలువురు కలిసి అతనిని పరామర్శించారు.
తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తేజును కలిసి తమ్ముడు క్షేమంగా ఉన్నాడని చెప్పడమే కాకుండా అతని చేతిలో చెయ్యి వేసి దిగిన ఫోటోను కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.అయితే ప్రమాదం తరువాత సాయి ధరమ్ తేజ్ చేతిని, చేతి వేళ్ళని మాత్రమే చూపిస్తున్నారు కానీ అతని మొహాన్ని ఇప్పటి వరకు చూపించకపోవడంతో అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే సాయి ధరమ్ తేజ్ కు ప్రమాద సమయంలో మొహానికి గాయాలు తగలయాని, అవి పూర్తిగా మానేవరుకు అతని ఫేస్ చూపించరని తెలుస్తోంది.మరి నిజంగానే సాయి తేజ్ మొహాన్ని చూపించక పోవడానికి కారణం అదేనా? లేక మరిదైన కారణం ఉందా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…