గత నెల 10 వ తేదీ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలాఉండగా సాయి తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
దాదాపు నెల రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సాయి తేజ్ దసరా పండుగ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరు,పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తేజు క్షేమంగా ఉన్నాడని తెలపడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్న సాయి తేజ్ ను పలువురు కలిసి అతనిని పరామర్శించారు.
తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తేజును కలిసి తమ్ముడు క్షేమంగా ఉన్నాడని చెప్పడమే కాకుండా అతని చేతిలో చెయ్యి వేసి దిగిన ఫోటోను కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.అయితే ప్రమాదం తరువాత సాయి ధరమ్ తేజ్ చేతిని, చేతి వేళ్ళని మాత్రమే చూపిస్తున్నారు కానీ అతని మొహాన్ని ఇప్పటి వరకు చూపించకపోవడంతో అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
అయితే సాయి ధరమ్ తేజ్ కు ప్రమాద సమయంలో మొహానికి గాయాలు తగలయాని, అవి పూర్తిగా మానేవరుకు అతని ఫేస్ చూపించరని తెలుస్తోంది.మరి నిజంగానే సాయి తేజ్ మొహాన్ని చూపించక పోవడానికి కారణం అదేనా? లేక మరిదైన కారణం ఉందా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…