Allu Arjun: ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటమేకాకుండా మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ పెద్దఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చేసిన ప్రతి ఒక్క ప్రకటన కూడా పలు వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈయన చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఒక వ్యాపార ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే.
ఈ విధంగా అల్లు అర్జున్ నటించిన ఈ ప్రకటనలో పూర్తిగా అవాస్తవాలే ఉన్నాయని, ఈ ప్రకటన అందరిని తప్పుదోవ పట్టించేలా ఉందంటూ సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు.ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చిన చైతన్య విద్యా సంస్థల పై అలాగే ఈ ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ పై ఈయన అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల జూన్ 6వ తేదీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి పలు పత్రికల్లో ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్ ప్రమోట్ చేశారు.అయితే ఈయన ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చైతన్య విద్యా సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన జొమాటో, ర్యాపిడో ప్రకటనలో కూడాపెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మర్చిపోకముందే మరోసారి చైతన్య విద్యా సంస్థల నుంచి ఈయన ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…