Raviteja-Balakrishna: ఫ్యాన్స్ ను వీళ్లు చెప్పు చేతల్లో పెట్టుకున్నారా..లేకపోతే ఇలాంటివి ఏంటి మరి..?
Raviteja-Balakrishna: అన్స్టాపబుల్ టాక్ షోతో.. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. తనదైన ప్రత్యేక శైలిలో ఈ షోకి వచ్చే సెలెబ్రిటీలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ షో బాలయ్య హోస్ట్ గా విజయవంతం అయిందనే చెప్పాలి. ఇప్పటిక వరకు దీనిలో మొత్తం 6 ఎపిసోడ్లు పూర్తవ్వగా.. ఎడో ఎపిసోడ్ లో రవితేజ మరియు గోపీచంద్ మలినేని హాజరయ్యారు.
వారితో బాలయ్య.. ఎన్నో విషయాలను మాట్లాడారు. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.. నందమూరి బాలకృష్ణ , రవితేజ అభిమానులు ఈ టాక్ షో డిసెంబర్ 31, 2021న ఆహాలో స్ట్రీమ్ అవ్వగా విపరీతంగా చూశారు. అందలో ముఖ్యంగా చెప్పుకునేది ఏముందంటే.. మాస్ మహారాజా రవితేజ అఖండ సినిమాలో ఫుల్ పాపులర్ అయిన ‘జై బాలయ్య’ పాటకు డ్యాన్స్ చేశాడు.
అతను ఆ పాట స్టెప్ను వేసి ప్రేక్షకులను.. ఫ్యాన్స్ ను అలరించాడు. బాలకృష్ణ ,రవితేజ మధ్య టగ్ ఆఫ్ వార్ పోటీ గేమ్ కూడా జరిగింది. ఈ వార్ లోని గోపీచంద్ వారిద్దరిని సరదా ప్రశ్నలు అడుగుతూ నవ్వులతో ఈ షోను ముందుకు నడిపించాడు. వాళ్ల షో సరదాగా.. కాస్త ఆవేదనతో సాగింది. అయితే బాలయ్య విషయానికి వస్తే.. కోపం విపరీతంగా ఉంటుంది. ఎవరైనా ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి ఫొటో దిగాలని అనిపించినప్పుడు ఒక్కో సందర్భంలో ఒప్పుకుంటాడు.. మరో సందర్భంలో సర్రున చేయిలేపి చెంప చెల్లుమనిపిస్తాడు.
ఇలాంటి సందర్భాలు చూశాం కూడా. అయితే సినిమా సెట్లో కూడా అతడు అలానే ఉంటాడట. ఇక రవితేజ విషయానికి వస్తే.. అతడికి కూడా ముక్కుపైనే కోపం ఉంటుంది. అతడు బూతుల పురాణం మొదలు పెడితే.. ఇక విక్రమార్కుడు సినిమాలో మొదటి 30 నిమిషాలు షో గుర్తుకు వస్తుంది. అంతలా బూతులు తిడతాడు. తనకు కోపం ఎక్కువ అని అతడు ఒప్పుకున్నాడు కూడా. ఇలా జరిగినవి అని సోషల్ మీడియాలో రాస్తుంటే.. పనీ పాటా లేని డ్యాష్ నా డ్యాష్ గాళ్లు’ అంటూ ఓ జోక్ టైప్ సెటైర్ వేస్తుంటారు. ఏ సోషల్ మీడియా వాళ్లు అయినా.. జరిగిన పనులు జరిగాయాయి అనే రాస్తారు కదా.. జరగనివి ఎవరూ రాయడానికి సాహసించరు. అలా రాస్తే.. ఇలా ఎందుకు రాశాం అని ఫ్యాన్స్ గగ్గోలు.. హీరో ఎవరినైనా తిడితే.. తిట్టండి.. అని.. పొగిడితే పొగడండి అని అంటున్నారు. ఏంటో మరి ఫ్యాన్స్ వీళ్లకు ఆటవస్తువుల్లా కనిపిస్తున్నారా..? మా హారో మా ఇష్టం అతడి కోసం ఏమైనా చేస్తాం అంటారా.. సరే మరి
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…