దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మంచి ఉద్యోగం దొరికినా లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఉద్యోగం మానేసే వాళ్లకు కొన్ని కంపెనీలు నోటీస్ పీరియడ్ లో కూడా విధులు నిర్వహించాలని సూచిస్తాయి. కొందరు అంగీకరించి నోటీస్ పీరియడ్ లో కూడా విధులు నిర్వహిస్తే మరి కొందరు మాత్రం నోటీస్ పీరియడ్ లో విధులు నిర్వహించడానికి ఇష్టపడరు.
కంపెనీలో రాజీనామా లేఖను సమర్పించినప్పటి నుంచి కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నోటీస్ పీరియడ్ ఉంటుంది. నోటీస్ పీరియడ్ సమయంలో కంపెనీ ఉద్యోగం మానేసిన వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తిని నియమించుకుని ఆ వ్యక్తికి ఉద్యోగానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నోటీస్ పీరియడ్ ముగిసిన తర్వాత మాత్రమే విధి నిర్వహణ నుంచి దూరం కావాలి తప్ప నోటీస్ పీరియడ్ సమయంలో మాత్రం విధులకు దూరం కాకూడదు.
కంపెనీలతో వివాదం లేకుండా ఉద్యోగం నుంచి తప్పుకుంటే మంచిది. అయితే కొన్ని కంపెనీలు జాబ్ మానేసిన వారికి నోటీస్ పీరియడ్ సమయంలో వేతనంలో కోత విధిస్తూ ఉంటాయి. వేతనంలో కోత విధించడం వల్ల నోటీస్ పీరియడ్ సమయానికి ఉద్యోగి టీడీఎస్ ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు నోటీస్ పీరియడ్ లో పేర్కొన్నన్ని పని దినాలు పని చేయకపోయినా నోటీస్ పీరియడ్ ప్రకారం టీడీఎస్ ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఉద్యోగులు టీడీఎస్ పై రిఫండ్ పొందే అవకాశం ఉండటం వల్ల ఉద్యోగులు టీడీఎస్ చెల్లించినా నష్టపోయే అవకాశం ఉండదు. ఉద్యోగులు నోటీస్ పీరియడ్ నియమ నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…