Dil Raju:తెలుగు చిత్రపరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ప్రతి ఏడాది సంక్రాంతికి తన నిర్మాణంలో ఏదో ఒక సినిమా విడుదల చేయడము లేదా ఇతర సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి దిల్ రాజుకు పెద్దగా కలిసి వచ్చినట్టు లేదేమోనని పలువురు భావిస్తున్నారు.
ముఖ్యంగా ఈయన నిర్మాణంలో వస్తున్నటువంటి వారసుడు సినిమా పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. దిల్ రాజు విజయ్ హీరోగా వరిసు సినిమాని తమిళంలో నిర్మించి తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేస్తున్నారు.అయితే గతంలో ఒకసారి సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజు చెప్పిన మాటలనే ఇప్పుడు తిరిగి ఆయనకే సూచించడం గమనార్హం.
దిల్ రాజుకు మద్దతుగా పలువురు టాలీవుడ్ నిర్మాతలు నిలబడి తెలుగు రాష్ట్రాలలో కూడా వారసుడు సినిమాకి తగినన్ని థియేటర్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తమిళంలో వరీసు సినిమాతో పాటు అజిత్ తునివు సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రావడంతో ఈయనకు మరో సమస్య వచ్చి పడింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు కూడా స్టార్ హీరోలు కావడంతో ఇద్దరికీ థియేటర్లో సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు సమాచారం. అయితే విజయ్ సినిమాకు ఆధారంగా మరికొన్ని థియేటర్లు కావాలని కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ నెంబర్ వన్ హీరో కనుక అతను సినిమాకు మరికొన్ని థియేటర్లు అదనంగా ఇవ్వాలని కోరారు.
ఈ విధంగా అజిత్ ను తక్కువ చేసి విజయ్ ను పొగడటంతో అజిత్ ఫాన్స్ ఈ విషయంలో తీవ్రస్థాయిలో దిల్ రాజు పై మండి పడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం దిల్ రాజు చెన్నై వచ్చినప్పుడు అజిత్ ఫ్యాన్స్ పవర్ ఏంటో తనకు చూపించాలని అజిత్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ విషయం దిల్ రాజు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారని అవి చూసి దిల్ రాజు తట్టుకోలేరని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఏ విధమైనటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే దిల్ రాజు చాలా సామరస్యంగా ప్రవర్తించాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…