Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టే అనంతరం నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సినిమాల ఎంపిక విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ ఎప్పుడు ఫర్ఫెక్ట్ గా ఉంటుందని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.
ఈ క్రమంలోనే సరైన అవగాహనతో ఈయన ఏకంగా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబంలా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఇక్కడ అలా ఉండదు. ఎవరి దారి వాళ్ళదే.ఇండస్ట్రీలో కొనసాగాలంటే సిగ్గు నీతిమానం ఇవన్నీ వదిలేస్తేనే ఇండస్ట్రీలో ఉండగలమంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా చూడకుండా డిస్ట్రిబ్యూటర్లు కొనే వస్తువు సినిమా అని, దారుణమైన పరిస్థితి ఏమిటంటే డిస్టిబూటర్లు కూడా ప్రేక్షకులతో పాటు థియేటర్లో సినిమా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్లు కొన్నిసార్లు లాభాలు పొందిన ఎక్కువ శాతం నష్టపోయే పరిస్థితిలో ఏర్పడతాయని అందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పూర్తిగా నష్టపోతుందంటూ తెలియజేశారు. తాను కూడా మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల నష్టపోయాయని ప్రస్తుతం కాస్త లాభాలు అందుకున్నానని తెలిపారు.ఇక ఇండస్ట్రీలో తానంటే అసూయ పడేవారు చాలామంది ఉన్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…