Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. దిల్ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గా మారిన రాజు ఆ సినిమాని తన పేరుగా చేసుకొని దిల్ రాజుగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సినిమా థియేటర్ల విషయంలో వివాదాలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వారసుడు సినిమా తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు థియేటర్లో కేటాయించామని కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు సినిమా థియేటర్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా అనేది ఒక వ్యాపారం.. ప్రస్తుతం నేను తమిళ హీరో తో తీసిన సినిమా విడుదల చేయడానికి థియేటర్ల కోసం ప్రయత్నిస్తున్నాను అని వెల్లడించాడు.
సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమాకి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీగా నిలుస్తున్నాయి. ఇక తమిళ్ భాషలో అజిత్ నటించిన సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ కన్నా విజయ్ కి ఎక్కువ పాపులారిటీ ఉంది. అందువల్ల మాకు మరొక 50 థియేటర్లు ఎక్కువగా కావాలని అడుక్కుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
చెన్నైలో మొత్తం ఎనిమిది వందల థియేటర్లో ఉండగా వీరికి సగం కేటాయించారు. అయితే విజయ్ పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని మరొక 50 థియేటర్లు ఎక్కువ కేటాయించమని దిల్ రాజు ఆ సినిమా నిర్మాతలను వేడుకోనున్నాడు. అజిత్ నటిస్తున్న సినిమాని ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నాడు. నేను ఆయన్ని కలిసి మాట్లాడుతానని దిల్ రాజు అన్నారు. అయితే అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్ హీరో అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. అజిత్ ని తక్కువ చేస్తూ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వివాదం చెలరేగేలా ఉంది. అజిత్ పాపులారిటీ గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…