Director & Actor Samudhrakhani : సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా బ్రో తాజాగా ఆ సినిమా విడుదల కాగా సినిమాకు సంబంధించిన విశేషాలను తెలుపుతు చిత్ర యూనిట్ పలు ప్రొమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. అలా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న చిత్ర డైరెక్టర్ సముద్రఖని ఆ సినిమా విశేషాలను తనకు పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపారు.
పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చిందంటే….
సినిమా తమిళంలో తానే నటించి డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో సినిమాను రీమేక్ చేయాలనీ భావించారు. అలా తెలుగు నేటివిటీ కి దగ్గరగా సినిమా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకోవాలని భావించినపుడు త్రివిక్రమ్ గారి వద్దకు కథ వెళ్ళింది. ఆయన స్క్రిప్ట్ లో మార్పులు చేయగా జీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కథ నచ్చి చేయాలనీ భావించారు. ఇక ఒక క్యారెక్టర్ కు సాయి ధరమ్ తేజ్ ను అనుకోగా మరో పాత్రకు ఒక పవర్ ఫుల్ నటుడైతే చెప్పాలనుకున్న మెసేజ్ జనాలకు రీచ్ అవుతుందని భావించి పవన్ కళ్యాణ్ గారిని అడగడం ఆయన ఒప్పుకోవడం జరిగాయాని సముద్రఖని తెలిపారు.
21 రోజులు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఉండగా ఆయనకు అనుకూలంగా షెడ్యూల్ ప్లాన్ చేసాం అందుకే త్వరగా సినిమా అయిపోయింది. హరీష్ శంకర్, క్రిష్ ప్రాజెక్ట్స్ కంటే ముందు ఈ సినిమా అయిపోడానికి కారణం అన్ని కలిసిరావడమే. టైం కలిసివస్తే అన్ని జరిగిపోతాయి అని నేను నమ్ముతాను అలాగే ఈ సినిమా కూడా జరిగింది అందుకే అన్న కూడా 21 రోజులు లైన్ గా షూటింగ్ కి వచ్చారు అంటూ సముద్రఖని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…