డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా సిద్ధార్థ జంటగా తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఆ దర్శకుడి పేరు ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. బొమ్మరిల్లు సినిమా తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ హీరోగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదేవిధంగా తన జీవితంలో హిట్ ఫ్లాప్ అనేది రెండు సమానంగా ఉంటాయని మన జీవితంలో రెండింటిని సమానంగా తీసుకోవాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆరెంజ్” సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఏ సినిమాకి కూడా అంత కష్టపడి పని చేయలేదని ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా చేసినందుకు తనకు ఎంతో హ్యాపీగా ఉందని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత నాగబాబు ఎంతో నష్టపోయారు. ఇలా నష్టపోవడంతో నాగబాబు సూసైడ్ చేసుకోవాలని భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఇందులో ఎంత వరకు నిజం ఉందనే ప్రశ్న భాస్కర్ గారికి ఎదురవడంతో… ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని… అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమేనని నాగబాబు గురించి వచ్చిన వార్తలను బొమ్మరిల్లు భాస్కర్ కొట్టిపారేశారు. ఒక సక్సెస్ ను మనం ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటామో ఫెయిల్యూర్ ను కూడా అదే విధంగానే యాక్సెప్ట్ చేయాలని తన దృష్టిలో రెండు ఒకటేనని తెలియజేశారు.
ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్క బ్యాచిలర్ ని ఆలోచింపజేస్తుందని… ఇందులో అఖిల్ క్యారెక్టర్,లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ఆదరించాలని తెలియజేశారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…