Featured

Director Nandam Harichandhra Rao : చంద్రబాబు నాయుడు మినిస్ట్రీ పోయాకే ఎన్టీఆర్ సొంత పార్టీ ఆలోచన చేసారు…: డైరెక్టర్ నందం హరిశ్చంద్ర రావు

Director Nandam Harichandhra Rao : దాసరి గారి శిష్యుడు గా తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో ఇండస్ట్రీలోకి చాలా యాదృచ్చికంగా వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఎంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో ‘స్వర్గం నరకం’ సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు ‘తాత మనవడు’ సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా ‘సంసార సాగరం’ సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు ఇక అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు.

చంద్రబాబు మినిస్ట్రీ వల్లే టీడీపీ పార్టీ…

ఎన్టీఆర్ గారు దాసరి గారితో ‘బొబ్బిలి పులి’ సినిమా చేస్తున్న సమయంలో చంద్రబాబు గారి మంత్రి పదవి అప్పటి సీఎం భవనం వెంకట్రావ్ గారు తీసేసారు. అసలే షూటింగ్ చాలా లేట్ అవుతోందనే టెన్షన్ లో ఉండగా ఎన్టీఆర్ గారు చంద్రబాబు మంత్రి పదవి పాయిందనే వార్త తెలిసీ హైదరాబాద్ వెళ్లాలంటూ ఒకరోజు కావాలని అడిగారు.

ఇక వెళ్లి వచ్చిన తరువాత ఆయన మాట్లాడుతూ అసలు మనల్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు. మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అంటూ సీఎం గురించి మాట్లాడుతున్నారు. ఏదోకటి పరిష్కారం చూడాలి అంటూ అన్నారు. అదే సంఘటన వలన ఎన్టీఆర్ గారు సొంత పార్టీ టీడీపీ పెట్టుకోడానికి బీజం పడింది అంటూ అప్పటి సంగతులను వివరించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago