Featured

Director PNR : ఎన్టీఆర్ చెప్పాడనే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకున్నా.. నిర్మాత నన్ను రోడ్డు మీద నిలబెట్టేసాడు.. ఆ దెబ్బతో 3 కోట్లు నష్టపోయాను.. : డైరెక్టర్ పిఎన్ఆర్

Director PNR : పి ఎన్ రాంచంద్రం రావు…. దర్శకుడిగా నిర్మాతగా తెలుగు, కన్నడ, తమిళ్ లో ఎన్నో సినిమాలను తీసారు. కొత్త నటులను పరిచయం చేయడంలో కూడా ముందుంటారు. ‘మానవరాలి పెళ్లి’ సినిమాతో సౌందర్య ను, ‘సహనం’ సినిమాతో విలన్ గా ప్రకాష్ రాజ్ ను, ‘లీడర్’ సినిమాతో ప్రియారామాన్ ను, ‘జాక్ పాట్’ సినిమాతో నవీనను, ‘గోల్ మాల్’ సినిమాతో నేహా, మీరా వాసుదేవన్ ను తెలుగు తెర కు పరిచయం చేశారు. అంతేకాకుండా సినిమాలలో హీరోగా కనిపించే ముందు ఎన్టీఆర్ ను ‘భక్త మార్కండేయ’ అనే తెలుగు సీరియల్లో చూపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న పిఎన్ఆర్ తాను సినిమాలలో నష్టపోయిన దాని గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఆ నిర్మాత నన్ను ముంబాయి నడిరోడ్డిలో వదిలేసాడు…..

ఎన్టీఆర్ తో సీరియల్ తీసిన చనువుతో ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలనీ ఎదురుచూసారట. అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంతమంది అవహేళన చేసినా ఒకసారి జీవితంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని దృఢ నిశ్చయంతో వున్నారట. కానీ ఆ సమయంలో మూడు నాలుగు ఏళ్ళు గడిచాక, ఒక నిర్మాత వచ్చి కలవడంతో, ఇలా అవకాశం వచ్చింది ఎలా అని ఎన్టీఆర్ ని అడుగగా… అందుకు ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేయండి సక్సెస్ అవుతారు, నేనే వచ్చి క్లాప్ కొడతాను అని ప్రోత్సహించారట. అనుకున్నట్టుగానే అన్ని జరిగాయి అని చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకు జేడీ చక్రవర్తి హీరోగా, మరొక హీరో గా కన్నడ హీరోని ఎంచుకోగా, ముంబాయి కి వెళ్లి లొకేషన్ చూసుకోవాలి అన్న తరుణంలో నిర్మాత హ్యాండ్ ఇచ్చారట. దాంతో మొత్తం భారం తన మీద వేసుకొని సినిమాను గట్టెంకించి, 3 కోట్లు నష్టపోయాను అని తన భాద ను తెలియజేసారు.

Bhargavi

Recent Posts

ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…

4 minutes ago

ఫ్రెష్ మటన్ ఎలా గుర్తించాలి?.. తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్!

వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…

10 minutes ago

ట్రోలింగ్‌ను జయించి టాప్ మార్కులు.. ప్రాచీ నిగమ్ స్ఫూర్తిదాయక గాథ

ఎగతాళిని ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఓ విద్యార్థిని మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాచి…

59 minutes ago

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మౌనం.. వ్యూహమా? సంకోచమా?

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేపిన అంశం కవిత వ్యాఖ్యలు. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయంగా మరో దశలోకి…

1 hour ago

లక్నో జట్టులో కలకలం.. పంత్ కెప్టెన్సీపై జాఫర్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస ఓటములతో జట్టు…

1 hour ago

రక్తహీనతతో బాధపడుతున్నారా?.. ఈ డైట్ ఫాలో అయితే హీమోగ్లోబిన్ పెరుగుతుంది!

నేటి కాలంలో రక్తహీనత సమస్య చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరంలో హీమోగ్లోబిన్…

2 hours ago