ప్రస్తుతం సోషల్ మీడియాలో, అన్నీ ఇండస్ట్రీలలో ఎక్కడ చూసినా కూడా పునీత్ మరణం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు సోషల్ మీడియాలో వేదికగా పునీత్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అతడి మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అతడి మరణవార్త విని చాలా మంది షాక్ కు గురయ్యారు. అయితే అప్పటివరకూ బాగానే ఉన్నా పునీత్ ఒక్కసారిగా ఆస్పత్రి పాలవ్వడం ఆ తర్వాత మరణించడం అన్నది ఇప్పటికి కూడా షాకింగ్ గానే ఉంది.
పునీత్ ఇంత చిన్న వయసులోనే నూరేళ్లు నుండి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఏంటి అంటూ అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి మరణవార్త విన్న అభిమానులు హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికే ఇతడి మరణవార్త పై పలువురు సినీ ప్రముఖులు పునీత్ తో ఉన్న వారి అనుబంధం గురించి బయట పెడుతున్నారు.తాజాగా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
పునీత్ మరణవార్త విన్న ఆర్జీవి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.పునీత్ రాజ్ హఠాన్మరణ వార్త షాకింగ్కి గురి చేసింది. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మన కళ్లు తెరిపించే భయంకరమైన నిజం ఎవరం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి జీవితాన్ని బతికుండగానే సంతోషంగా గడిపేయాలి’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రతీ అంశంలో కాంట్రవర్సీ వెతికే వర్మ పునీత్ మరణం విషయంలో మాత్రం భిన్నంగా స్పందించడంతో నెటిజన్లు ఆయనకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.
శుక్రవారం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్కు తరలించారు.అయితే పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…