కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఓసీఎఫ్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ‘ఓసీఎఫ్ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్ను పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హ్యాష్ ట్యాగ్ అర్థం ఏంటో చెప్పండి అంటూ నెటిజన్లను ప్రశ్నిస్తూ పోస్టులు చేసింది నిహారిక.ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు హ్యాష్ ట్యాగ్ కీ అర్థం ఇదే అంటూ వారిలో వున్న బయటపెట్టారు.
ఇక ఈ హ్యాష్ ట్యాగ్ విషయంలో చాలామంది కామెంట్లు చేయగా, అందులో కొంతమందికి నిహారిక తనదైన శైలిలోసమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే నెటిజన్ ల క్రియేటివిటీకి నిహారిక ఫిదా అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం తండ్రి నగబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని నిహారిక తన కొత్త ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను తన అభిమానులతో పంచుకుంది. ఓసీఎఫ్ఎస్ అంటే ఏంటో తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.
పెళ్లి తరువాత వెండి తెరకు దూరమైన నిహారిక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ మీనింగ్ ను తెలియజేసింది.ఈ క్రమంలోనే జీ 5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్కు నిర్మాతగా మారింది నిహారిక. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.జీ5 ఓటీటీ వేదిక నుంచి ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ నవంబరు 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే నాగబాబు పుట్టిన రోజును ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా భర్త చైతన్య, వరుణ్తేజ్,తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన నిహారిక కుటుంబ అనే క్యాప్షన్ను రాసుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…