ప్రస్తుతం సోషల్ మీడియాలో, అన్నీ ఇండస్ట్రీలలో ఎక్కడ చూసినా కూడా పునీత్ మరణం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. పలువురు సోషల్ మీడియాలో వేదికగా పునీత్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అతడి మరణంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అతడి మరణవార్త విని చాలా మంది షాక్ కు గురయ్యారు. అయితే అప్పటివరకూ బాగానే ఉన్నా పునీత్ ఒక్కసారిగా ఆస్పత్రి పాలవ్వడం ఆ తర్వాత మరణించడం అన్నది ఇప్పటికి కూడా షాకింగ్ గానే ఉంది.

పునీత్ ఇంత చిన్న వయసులోనే నూరేళ్లు నుండి అనంత లోకాలకు వెళ్లిపోవడం ఏంటి అంటూ అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడి మరణవార్త విన్న అభిమానులు హాస్పిటల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికే ఇతడి మరణవార్త పై పలువురు సినీ ప్రముఖులు పునీత్ తో ఉన్న వారి అనుబంధం గురించి బయట పెడుతున్నారు.తాజాగా టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
పునీత్ మరణవార్త విన్న ఆర్జీవి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.పునీత్ రాజ్ హఠాన్మరణ వార్త షాకింగ్కి గురి చేసింది. అయితే ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మన కళ్లు తెరిపించే భయంకరమైన నిజం ఎవరం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి జీవితాన్ని బతికుండగానే సంతోషంగా గడిపేయాలి’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రతీ అంశంలో కాంట్రవర్సీ వెతికే వర్మ పునీత్ మరణం విషయంలో మాత్రం భిన్నంగా స్పందించడంతో నెటిజన్లు ఆయనకు మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.
శుక్రవారం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే కుటుంబసభ్యులు బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్కు తరలించారు.అయితే పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.






























