Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఏంటో మనకు తెలిసింది. ఈయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబడుతుందనే విషయం మనకు తెలిసిందే.ఇకపోతే రజినీకాంత్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ కాంబినేషన్ అంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పక్క హిట్ అనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ముత్తు, పడయప్ప సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఇకపోతే ఎన్నో అంచనాల నడుమ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం లింగ. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వరకు రజనీకాంత్ రవికుమార్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది అయితే లింగా సినిమా డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున రజనీకాంత్ అభిమానులు దర్శకుడు రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విధంగా రజనీకాంత్ అభిమానులు పెద్ద ఎత్తున దర్శకుడు పై విమర్శలు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించని రవికుమార్ ఈ సినిమా విడుదలైన ఎనిమిది సంవత్సరాలకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని లింగా సినిమా గురించి ప్రస్తావించారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ లింగా సినిమా డిజాస్టర్ కావడానికి కారణం రజినీకాంత్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ ఈ సినిమాలో క్లైమాక్స్ బెలూన్స్ సన్నివేషాలను ముందుగా మేము అనుకోలేదు.అయితే ఈ సినిమా సమయంలో రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు అయితే తాను చేసిన సన్నివేశాలను చూడాలని రజనీకాంత్ కోరడంతో ఆయనకు ఈ సినిమాని చూపించాము అయితే ఈ సన్నివేశాలను చూసిన రజనీకాంత్ కొన్ని మార్పులు చేశారు.ఆయన చేసిన సూచనలు డైరెక్టర్లకు ఇతర సిబ్బందికి నచ్చకపోయినా సినిమాలో పెట్టాల్సి వచ్చింది.ఇక ఈ సినిమాని రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించాము తమకు సరైన సమయం లేకపోవడం వల్ల రజనీకాంత్ సూచించిన సన్నివేశాలు పెట్టడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఈ సందర్భంగా రవికుమార్ రజనీకాంత్ లింగా సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…