Director Sagar:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిన్నటి తరం దర్శకులలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి.ఈయన దర్శకత్వంలో వచ్చిన రామసక్కనోడు సినిమాకు గాను ఏకంగా మూడు నంది అవార్డులు వచ్చాయి. ఈ విధంగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విద్యాసాగర్ రెడ్డి అనంతరం నిర్మాతగా మారారు. ఇలా ఈయన డైరెక్టర్ గా సక్సెస్ అయిన విధంగా నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి గతంలో ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాస్ రావు పై తాను కోప్పడిన సందర్భాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే సాగర్ మాట్లాడుతూ తాను కోట శ్రీనివాసరావుతో ఓ సినిమా చేస్తున్న సమయంలో ఆయన బంధువులు ఎవరో చనిపోయారు ఇలా షూటింగ్ జరగాల్సి ఉండగా తాను రాలేనని ఇలా తన బంధువులు చనిపోయారని చెప్పారు.
ఇక తను చెప్పిన డేట్ ప్రకారమే తిరిగి షూటింగ్ ప్రారంభించాము ఆరోజు సెట్ లో అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన మాత్రం రాలేదు. ఆరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి మరొక రోజు షూటింగ్ పెట్టుకున్న కోటా రాలేదు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లి ఏంటి కోట షూటింగ్ కు వస్తారా? రారా ? నాలో మరో యాంగిల్ చూడొద్దు అంటూ తనని అరిచాను. అయితే అనంతరం ఆయన షూటింగ్లో పాల్గొని ఆ సినిమా పూర్తి చేసుకున్నారు.
ఇకపోతే ఎమ్మెస్ నారాయణ పై కూడా ఒకసారి ఏకంగా చేయి చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సాగర్ తెలిపారు.ఓ సినిమా షూటింగ్ నిమిత్తం సాయంత్రం ఆయన వెళ్లాల్సి ఉండగా లొకేషన్ లోనే మందు తాగుతూ కూర్చున్నారు. అయితే నిర్మాత తనకు ఓ పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.దీని గురించి మాట్లాడుతూ నిర్మాతలను బండబూతులు తిట్టడమే కాకుండా వీళ్ళు ఇలాగే అంటారు కానీ ఇవ్వరు అంటూ మాట్లాడారు. ఆ మాట విన్న నేను వెళ్లి చెంప చెల్లుమనిపించాను.అయితే తనని కొట్టిన కొన్ని నిమిషాలకే నిర్మాత మనిషి వచ్చి డబ్బు ఇచ్చారు. అంటూ ఈ సందర్భంగా సాగర్ అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…