మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా పూర్తి చేసుకొని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా RC15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ భారీగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభించబోతుందని గతంలో చిత్ర బృందం వెల్లడించారు.
ఇకపోతే ఈ సినిమా నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 11 నుంచి షూటింగ్ పనులు ప్రారంభించాలని దర్శకుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇక్కడ కాకుండా.. పూణేలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడు భాషలలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ జోడీ కట్టనున్నారు. ఇకపోతే చెర్రీ, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా.. ఇందులో చెర్రీ ఓ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకే ఒక్కడు సినిమా సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారా అనే ఆతృత ప్రేక్షకుల్లో నెలకొంది.
అక్టోబర్ 11 నుంచి ఈ సినిమా వరుస షూటింగ్ ను జరుపుకొనుంది. అయితే ఎక్కువగా ఈ సినిమాను తెలంగాణ పరిసర ప్రాంతాలలో పూర్తి చేయాలని దర్శకుడు సినిమా లొకేషన్లో కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ పనులను పూర్తిచేసుకుని త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…