Director V.N. Adithya : చిరంజీవి ఇంట్లో పెళ్ళికి వెళితే ఎం జరిగిందంటే…: డైరెక్టర్ విఎన్ ఆదిత్య

Director V.N. Adithya : 2001లో వచ్చిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో తొలిసారిగా డైరెక్టర్ గా హిట్ కొట్టాడు విఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమా తరువాత మళ్ళీ ఉదయ్ కిరణ్ తోనే మరో సాయి ‘శ్రీరామ్’ అనే సినిమా చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఒకేసారి ఆదిత్య కు చిరంజీవి అలాగే నాగార్జున ఇద్దరి నుండి ఆఫర్ వచ్చింది. ఒకేసారి రెండు హ్యాండిల్ చేయడం కష్టమై చిరంజీవి సినిమా సరిగా రాకపోవడం వల్ల వదులుకున్నారు. ఇక నాగార్జున తో ‘నేనున్నాను’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ సినిమా సక్సెస్ తరువాత విఎన్ ఆదిత్య తీసిన మనసు మాట వినదు, బాస్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య గారు తన కెరీర్ గురించి మాట్లాడారు.

చిరంజీవి గారింట్లో ఫంక్షన్ కి వెళితే ఆయన అలా మాట్లాడారు…

రావి కొండలరావు గారితో మా నాన్నగారికి ఉన్న కొద్దిపాటి పరిచయంతో చెన్నై కి ఆయనను కలవడానికి వెళ్లిన నేను అక్కడ ఆయన ద్వారా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే రైటర్ రెండు పనులకు చేరాను. సింగీతం శ్రీనివాసరావు వంటి పెద్ద దర్శకుల వద్ద పని నేర్చుకున్నాను అంటూ ఆదిత్య తెలిపారు. అలా తెలుగువాళ్ళ దగ్గర ఇటు తమిళ డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వల్ల రెండు చోట్ల మంచి టెక్నిషియన్స్ తో పరిచయం ఏర్పడిందని చెప్పారు ఆదిత్య. ఇటు హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గాను అలాగే స్క్రిప్ట్ పనుల్లో అసిస్టెంట్ గాను పనిచేయడం వల్ల హీరోల వద్ద మంచి రిలేషన్ ఉండేదని, వాళ్ళతో సినిమాలను చేసినా చేయకపోయినా వాళ్లకు ఆదిత్య మంచి టెక్నిషియన్ అని మాత్రం తెలుసని అది చాలా బాగా అనిపిస్తుందని చెప్పారు.

ఒకసారి చిరంజీవి గారి ఇంట్లో ఫంక్షన్ కి వెళితే అక్కడికి తమిళ డైరెక్టర్ పి వాసు గారు వచ్చారు. ఆయన నన్ను చూసి ఆయన సినిమాల్లో నేను అసిస్టెంట్ గా చేయడం వల్ల గుర్తు పట్టి గట్టిగ హగ్ చేసుకుని నువ్వు తెలుగులో ఇంత పెద్ద డైరెక్టర్ వి అయ్యావు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారు. ఆ సంఘటన మర్చిపోలేను అంటూ ఆదిత్య ఆయన అనుభవాలను పంచుకున్నారు.