Singer Sai chand wife Rajani : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తన గానంతో రగిలించి తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించిన సింగర్ సాయి చంద్ అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారు. బాల్యం నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన సాయి చంద్ విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి కెసిఆర్ ప్రభుత్వంలో గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటూ రాజకీయంగా భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశపడ్డాడు. అయితే అంతలోనే తన ఆయుష్షు తీరిపోయింది. చిన్న వయసులోనే భార్య బిడ్డలను అనాథలను చేసి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన పదవిని ఆయన భార్య రజని కి తెలంగాణ ప్రభుత్వం అప్పగించగా తాజాగా ఇంటర్వ్యూలో ఆమె తన భవిష్యత్ ప్రణాళికలు అలాగే కుటుంబం గురించి మాట్లాడారు.
ప్రమాణ స్వీకారం ఆరోజు చేయడానికి కారణం… ఆడబిడ్డ గురించి ఆరోజే…
సాయి చంద్ గారి హఠాన్మరణం తరువాత ఆయన భార్య రజని కోలుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఆపైన సాయి చంద్ గారు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉండగా ఆ పదవిని ఆయన భార్యకు అప్పగించగా ఆ పదవి ప్రమాణ స్వీకరానికి సాయి చంద్ గారి తండ్రి రాకపోవడం గురించి రజని గారు క్లారిటీ ఇస్తూ ఆరోజు బాగా వర్షం ఉండటం, ఎవరినీ పిలవాలని అనుకోకుండా సింపుల్ గా ప్రమాణ స్వీకారం చేయాలనుకోవడం వల్ల ఆరోజు నా భర్త ఫోటోతో ఆఫీస్ వెళ్లి ప్రమాణ స్వీకారం చేశాను అంతే అయినా తెలుసుకుని చాలా మంది వచ్చారు. ఎవరినీ నేను పిలవలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఆడపడచు గురించి చెబుతూ ఆమెకు కూడా ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వగా ఆ డబ్బును తన సొంత అకౌంట్ లో వేసుకుని తన చదువుకు ఉపయోగించాలని సలహా ఇచ్చానని, తనకు ఏదైనా సహాయం కావాలంటే తానున్నట్లు భరోసా ఇచ్చినట్లు అయితే చిన్నతనం నుండి తాను చదువులో చురుగ్గా ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుకుందని ఎవరి మీద ఆధారపడకుండా చదువుకుందని రజని తన అడపడుచు వెన్నెల గురించి చెప్పారు. ఇక వెన్నెల పుట్టకముందే సాయి చంద్ తో తనకు పరిచయం ఉందని వాళ్లంటికి వెళ్ళినపుడు వెన్నెల పేరు వేరే పెడితే బాగుంటుందని కూడా మావయ్య కి సూచించినట్లు తెలిపారు. మా కళ్ళముందు పుట్టి పెరిగిన అమ్మాయి తనతో ఎలాంటి విబేధాలు లేవు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…