పెళ్లి అనే బంధానికి ఎన్ని నిర్వచనాలు చెప్పినా తక్కువే. ఎన్ని బంధాలు ఉన్నా భార్యభర్తల బంధం అనేది గొప్పది. మనకంటూ ఎవరూ లేకపోయినా పెళ్లి అయిన తర్వాత మనకంటూ ఓ తోడు అనేది జీవితాంతం ఉంటుంది. అలా కడవరకు ఎవరూ ఉండరు.
అందుకే పెళ్లి జరిగే సమయంలోనే ఎంతో మంది సాక్షుల మధ్య, పెద్దల మధ్య పంతులు మంత్రాలు చదివి మరీ వివాహాన్ని జరిపిస్తారు. ఇదిలా ఉండగా.. ఆ పెళ్లి బంధాన్ని చాలామంది చిన్న చిన్న విషయాలకు తెంచుకునేందుకు ప్రయత్నింస్తుటారు. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. కానీ వాటిని కూర్చొని పరిష్కరించుకుంటే ఎంతటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.
ఇక్కడ ఓ ఘటనలో పెళ్లి జరిగి మూడు రోజులకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.మూడో రోజు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పడి.. కోర్టుకు వెళ్లారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రెండే రోజులు వీళ్లిద్దరు కలిసి ఉన్నారు.
మూడో రోజు కోర్టువైపు పరుగులు పెట్టారు. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. కచ్చితంగా వివాహం జరిగి సంవత్సరం అయి ఉండాలి. కానీ ఆ నిబంధనలను పట్టించుకోకుండా ఆ కోర్టు వాళ్లకు విడాకులను మంజూరు చేశారు. అయితే ఇలా ఎలా సాధ్యం అంటూ.. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ కోర్టు తీరుపై కూడా చర్చించుకుంటున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…