పెళ్లి అనే బంధానికి ఎన్ని నిర్వచనాలు చెప్పినా తక్కువే. ఎన్ని బంధాలు ఉన్నా భార్యభర్తల బంధం అనేది గొప్పది. మనకంటూ ఎవరూ లేకపోయినా పెళ్లి అయిన తర్వాత మనకంటూ ఓ తోడు అనేది జీవితాంతం ఉంటుంది. అలా కడవరకు ఎవరూ ఉండరు.
అందుకే పెళ్లి జరిగే సమయంలోనే ఎంతో మంది సాక్షుల మధ్య, పెద్దల మధ్య పంతులు మంత్రాలు చదివి మరీ వివాహాన్ని జరిపిస్తారు. ఇదిలా ఉండగా.. ఆ పెళ్లి బంధాన్ని చాలామంది చిన్న చిన్న విషయాలకు తెంచుకునేందుకు ప్రయత్నింస్తుటారు. భార్యభర్తల మధ్య గొడవలు అనేవి సహజం. కానీ వాటిని కూర్చొని పరిష్కరించుకుంటే ఎంతటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.
ఇక్కడ ఓ ఘటనలో పెళ్లి జరిగి మూడు రోజులకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.మూడో రోజు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పడి.. కోర్టుకు వెళ్లారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. రెండే రోజులు వీళ్లిద్దరు కలిసి ఉన్నారు.
మూడో రోజు కోర్టువైపు పరుగులు పెట్టారు. అయితే హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. కచ్చితంగా వివాహం జరిగి సంవత్సరం అయి ఉండాలి. కానీ ఆ నిబంధనలను పట్టించుకోకుండా ఆ కోర్టు వాళ్లకు విడాకులను మంజూరు చేశారు. అయితే ఇలా ఎలా సాధ్యం అంటూ.. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ కోర్టు తీరుపై కూడా చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…