బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో అందరి రంగులు బయటపడుతున్నాయి. రాను రాను ఆసక్తికరంగా మారిపోతోంది. రెండో వారం ఎలిమినేషన్ రౌండ్ లో అంతా రచ్చ రచ్చ అయిపోయింది. నామినేషన్ కు ముందు హౌస్ లో ఉన్న 18 మంది కంటెస్టెంట్లను రెండు టీంలుగా విడదీసి.. ఒక టీం సభ్యులు వేరే టీం సభ్యులను నామినేట్ చేసే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేశాడు.
నామినేషన్ ప్రక్రియను మొదట కెప్టెన్ సిరి మొదలు పెట్టారు. అందులో ముందుగా.. ఉమను, నటరాజ్ కు రంగు పూసి నామినేట్ చేశారు సిరి. తర్వాత ఒకరిపై ఒకరు నామినేషన్ చేయడానికి గల కారణాలను తెలియజేస్తూ.. వారికి నచ్చని వారిని నామినేట్ చేశారు. ఇందులో ముఖ్యంగా శ్వేత, ఉమ అయితే నామినేషన్ ప్రక్రియలో లిమిట్ దాటి ప్రవర్తించినట్టు అనిపించింది.
ఉమకు రంగు పూసిన తర్వాత విశ్వ దానికిగల కారణాలు చెబుతున్న సమయంలో ఉమ మాట్లాడిన తీరు అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆమె మాటలు అసభ్యకరంగా ఉండటంతో ప్రియాంకా సింగ్, షణ్ముఖ్ ఆమె మాటలను వినలేక ఇబ్బంది పడ్డారు. తర్వాత నామినేషన్ చేయడానికి వచ్చిన శ్వేత అయితే చెడుగుడు ఆడేసింది. ఒకొక్కరికి ఇచ్చి పడేసింది.
లోబో మరియు హమిదా ఇద్దరు ఫేక్ అంటూ ఆరోపణలు చేసింది. అదే కోపంతో హమిదాకు అక్కడ ఉన్న రంగుతీసుకెళ్లి ఆమె మొహంపై పూసింది. అది ఎక్కువగా ఆమె ముఖం మీద పడటంతో ఎంతో ఇబ్బంది పడింది హమిదా. లోబోకు కూడా ఆ రంగును విపరీతంగా పూసింది. తర్వాత హమిదాకు శ్వేత స్వారీ అని కూడా చెప్పింది. ఇలా నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…