Divyavani : తెలుగింటి బాపు బొమ్మ దివ్యవాణి అంటే అప్పట్లో అందరూ ఫిదా అయ్యేవారు. చామనచాయలో గడుసు తనం, పెద్ధ కళ్ళు వాలు జడతో అందరినీ ఆకట్టుకున్న ఈ తెలుగు బొమ్మ చేసింది కొన్ని సినిమాలే అయినా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయేలా ఆ సినిమాలలో పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘పెళ్లి పుస్తకం’ లో సత్యభామ గా ఆమె నటన ఎవరూ మర్చిపోలేరు. ఇక ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ వంటి సినిమాలలో కూడా అందరినీ ఆకట్టుకుంది దివ్యవాణి. హీరోయిన్ గా బాగా ఉన్నపుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన దివ్యవాణి పిల్లలు పుట్టాక హిందూ నుండి క్రిస్టియానిటీ కి మారిపోయింది. అలా ఎందుకు మారింది ఏ విషయాలు క్రీస్తు వైపుకు ఆమెను నడిపించాయి అన్నది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
మా బంధువులే చేతబడి చేశారు…
దివ్యవాణి క్రీస్తును నమ్మడానికి బలమైన కారణం తన కొడుకు అంటూ చెప్పారు. పెళ్లి జరిగిన తరువాత నేను తెలుగు మా అయన కన్నడ వ్యక్తి అవడంతో గొడవలు జరిగాయని, అత్తింటి వాళ్లలో కొంతమందికి నేను నచ్చలేదు. దీంతో పెళ్లైన కొద్ది రోజులకే గొడవలు అన్ని జరగడం వల్ల నేను అతింటికి ఎక్కువ వెళ్ళలేదని ఇక్కడే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఇక పిల్లలు పుట్టాక వాళ్ళే ప్రపంచం అయిపోయారని వాళ్ళకోసమే అన్నట్టుగా బ్రతికానంటూ చెప్పారు. అయితే బాబు పుట్టాక తనకు అనారోగ్యంతో బాధపడ్డాడు చాలా మంది వైద్యులకు చూపించినా గుళ్ళు తిరిగినా నయం కాలేదు.
ఎవరు ఏది చెప్పినా అక్కడికి వెళ్లడం తాయత్తులు కట్టడం చేసేదాన్ని అంటూ చెప్పారు దివ్యవాణి. అయితే మా అత్తింటి వైపు బంధువులు మాకున్న ఆస్తి కోసం మా బాబుకి చేతబడి చేసారు. ఈ విషయం ఆలస్యంగా అర్థమైంది. అదే సమయంలో బాబు వెళ్లే స్కూల్ లో టీచర్ క్రీస్తు గురించి చెప్పడంతో ఒకసారి అక్కడ కూడా ప్రయత్నిద్దామని వెళ్లాను. అలా యేసు ప్రభువు గురించి తెలుసుకున్నాక క్రిస్టియన్ గా మారాను, నా కొడుకు కూడా నయం అయింది అంటూ చెప్పారు దివ్యవాణి.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…