R.K Roja: సినీనటి మంత్రి రోజా ఇటీవల ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. నగరి నియోజక వర్గం నుంచి గత రెండుసార్లు విజయం అందుకున్నటువంటి ఈమె ఈసారి ఎన్నికలలో ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇలా రోజా నగరిలో ఓడిపోవడమే కాకుండా రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలవకపోవడంతో ఆ పార్టీ నేతలు అందరూ కూడా వారి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇకపోతే రోజా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ఈమె జడ్జిగా ఈ కార్యక్రమానికి ఎంతో అట్రాక్షన్ గా మారడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. ఇక రోజాకు మంత్రి పదవి రావడంతో తనకు మంత్రిగా మరిన్ని బాధ్యతలు పెరిగాయని ఈమె ఈ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.
ఇలా ఈ కార్యక్రమానికి దూరమైనటువంటి రోజా అనంతరం ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. ఇంద్రజ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించారు. కానీ ఇటీవల ఇంద్రజ కూడా ఈ కార్యక్రమానికి చిన్న విరామం తీసుకోబోతున్నానని తెలిపారు. దీంతో ఆమె స్థానంలో ఎవరు వస్తున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఇక రోజా ఓడిపోవడంతో ఈమె తిరిగి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
రోజా వద్దు..
ఇటీవల విడుదల చేసిన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో పై నేటిజన్స్ కామెంట్లు చేస్తూ రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా రావడానికి వీలు లేదంటూ నిరసన తెలుపుతున్నారు.ఒకవేళ రోజు కనుక ఈ కార్యక్రమానికి జడ్జిగా వస్తే తాము జబర్దస్త్ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామంటూ నేటిజన్స్ చేస్తున్న ఈ కామెంట్ లు వైరల్ అవుతున్నాయి. మరి రోజా ఈ కార్యక్రమానికి వస్తారో రాదో తెలియదు కానీ ఆమెకు మాత్రం వ్యతిరేకత ఏర్పడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…