Radisson Pub: పబ్ లో ఉన్నంత మాత్రాన మాపై నిందలు వేస్తారా.. మా జీవితాలను నాశనం చేయొద్దు: జూనియర్ ఆర్టిస్ట్
Radisson Pub: శనివారం అర్థరాత్రి బంజారా హిల్స్ లో రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటనలో ఎంతో మంది సినీ ప్రముఖుల పిల్లలు, వ్యాపారవేత్త పిల్లలు, జూనియర్ ఆర్టిస్టులు అరెస్టయ్యారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు అంటూ కొందరు సినీ ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న కల్లపు కుషితా ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కుషితా మాట్లాడుతూ… లేట్ అవర్స్ పబ్ లో ఉండటం మా తప్పు కాదు.. పబ్ లో ఉన్నంత మాత్రాన మేము డ్రగ్స్ తీసుకున్నామని మాపై నిందలు వేయడం సరికాదు.
లేట్ నైట్ పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్టీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాము అనే లోపు పోలీసులు వచ్చి దాడి చేశారని, పబ్ లో ఎక్కువమంది ఉండడం నిజమేనని ఈమె వెల్లడించారు. నిజంగా అక్కడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి వెళ్లే వాళ్ళము కాదని, ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చాము, మా జీవితాలతో ఆడుకోవద్దని,మా జీవితాలను నాశనం చేయొద్దని ఈమె సెల్ఫీ వీడియో ద్వారా మీడియాను కోరారు.
మేము పబ్ లో ఉన్నాము అంతే కానీ ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించలేదని కావాల్సి వస్తేఎప్పుడైనా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కుషితా వెల్లడించారు.అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, అలాంటి వారికి మేము కూడా సహకరిస్తామని ఇలాంటి దుష్ప్రచారాలు వల్ల మా తల్లిదండ్రులు మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారని ఈమె తెలియచేశారు. దయచేసి మీడియా వాళ్ళు సహనం పాటించాలని మమ్మల్ని బద్నాం చేయకండి అంటూ వేడుకున్నారు.
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన…