Radisson Pub: పబ్ లో ఉన్నంత మాత్రాన మాపై నిందలు వేస్తారా.. మా జీవితాలను నాశనం చేయొద్దు: జూనియర్ ఆర్టిస్ట్
Radisson Pub: శనివారం అర్థరాత్రి బంజారా హిల్స్ లో రాడిసన్ హోటల్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేసిన ఘటనలో ఎంతో మంది సినీ ప్రముఖుల పిల్లలు, వ్యాపారవేత్త పిల్లలు, జూనియర్ ఆర్టిస్టులు అరెస్టయ్యారు. ఈ ఘటనకు సంబంధించి దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే తమపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు అంటూ కొందరు సినీ ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న కల్లపు కుషితా ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో కుషితా మాట్లాడుతూ… లేట్ అవర్స్ పబ్ లో ఉండటం మా తప్పు కాదు.. పబ్ లో ఉన్నంత మాత్రాన మేము డ్రగ్స్ తీసుకున్నామని మాపై నిందలు వేయడం సరికాదు.
లేట్ నైట్ పబ్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పార్టీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాము అనే లోపు పోలీసులు వచ్చి దాడి చేశారని, పబ్ లో ఎక్కువమంది ఉండడం నిజమేనని ఈమె వెల్లడించారు. నిజంగా అక్కడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి వెళ్లే వాళ్ళము కాదని, ఇప్పుడిప్పుడే మేము ఇండస్ట్రీలోకి వచ్చాము, మా జీవితాలతో ఆడుకోవద్దని,మా జీవితాలను నాశనం చేయొద్దని ఈమె సెల్ఫీ వీడియో ద్వారా మీడియాను కోరారు.
మేము పబ్ లో ఉన్నాము అంతే కానీ ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించలేదని కావాల్సి వస్తేఎప్పుడైనా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కుషితా వెల్లడించారు.అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని, అలాంటి వారికి మేము కూడా సహకరిస్తామని ఇలాంటి దుష్ప్రచారాలు వల్ల మా తల్లిదండ్రులు మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారని ఈమె తెలియచేశారు. దయచేసి మీడియా వాళ్ళు సహనం పాటించాలని మమ్మల్ని బద్నాం చేయకండి అంటూ వేడుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…