Featured

Deepika Padukone: కల్కి కోసం దీపికా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దీపిక పదుకొనే ఒకరు. ఈమె బాలీవుడ్ హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే దీపిక ఇటీవల బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు సినిమాలకు కూడా కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాకు ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 9వ తేదీ విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో దీపిక పదుకొనే మాత్రమే కాకుండా దిశా పటాని కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో ఏడుగురు స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ఈ హీరోల గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్తలు వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఇందులో దీపిక పదుకొనే నటిస్తున్నటువంటి తరుణంలో ఈమె ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ 20 కోట్లు…

నటి దీపిక పదుకొనే ఈ సినిమాలో నటించడం కోసం ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. ఈ క్రమంలోనే నిర్మాతలు కూడా తనకు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమలలో కొత్త అనుభవం.. భక్తులకు వీఆర్ ద్వారా శ్రీవారి దర్శనం!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండే సమయం కూడా ఎక్కువవుతోంది.…

12 minutes ago

“ఆర్టిస్టులు నేరస్తులా?”.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్

సోషల్ మీడియాలో పెరుగుతున్న ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర…

16 minutes ago

ఆలయ దర్శనంతో సందడి చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో భక్తి వాతావరణం నెలకొంది. గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో తాజాగా నిర్మించిన కాశి విశ్వేశ్వరాలయం…

25 minutes ago

పెరుగు మంచిదా? మజ్జిగ మంచిదా? నిపుణుల క్లారిటీ

వేసవి కాలం మొదలైతే మన శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలపై అందరి దృష్టి పడుతుంది. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ అనే…

46 minutes ago

“మా రాజధాని అమరావతి”.. గర్వంగా చెప్పే రోజు వచ్చిందన్న బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కీలక పరిణామాల మధ్య నటుడు, ప్రజాప్రతినిధి నందమూరి బాలకృష్ణ భావోద్వేగ స్పందన వ్యక్తం చేశారు. అమరావతికి…

2 hours ago

పేలుడుతో చిద్రమైన ఇల్లు.. ఇద్దరు పిల్లలు బలి

మణిపూర్ రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక నివాస గృహంపైకి అనుమానాస్పదంగా రాకెట్ దూసుకువచ్చి పేలడంతో…

2 hours ago