దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వారిలో చలపతిరావు ఒకరు. విలక్షణ నటుడిగా, తండ్రిగా, తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలో నటించిన చలపతిరావు ఆ తరువాత తండ్రి, తాతల పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నాగార్జున హీరోగా నటించినటువంటి “నిన్నే పెళ్ళాడుతా”చిత్రంలో నాగార్జునకి తండ్రి పాత్రలో నటించారు. ఆ పాత్రే చలపతిరావు కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.
ఇక చలపతిరావు వ్యక్తిగత విషయానికి వస్తే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చలపతిరావుకి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు కాగా, కొడుకు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగానే మరణించారు. అయితే తను అగ్నిప్రమాదంలో మరణించిందని ఓ సందర్భంలో చలపతిరావు తెలియజేశారు.
అప్పట్లో మద్రాసులో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి.ఒక రోజు రాత్రి రెండుగంటల సమయంలో నీళ్ళు వస్తే తాను పడతానని చలపతిరావు అనగా మీరు పడుకోండి నేను పడతానని చెప్పి తన భార్య వెళ్లిందని, వెళ్ళిన కొద్దిసేపటికి “నిన్నే.. నిన్నే” అనే మాటలు వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూసేసరికి వంట గదిలో తన భార్య చీర అంటుకుని మంటలలో కాలిపోతోంది.
వెంటనే మంటలను ఆర్పి తనని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్ళాను అప్పటికే వెనక భాగం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తను చివరి రోజు ఆ పిల్లల వేదన భరించలేవు మరో పెళ్లి చేసుకో అంటూ ఆమె మరణించిందని చలపతిరావు చెప్పారు. అయితే ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని తన భార్య చెప్పలేకపోయింది. అయితే తన భార్య మరణించిన తర్వాత ఎంతో మంది మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ చలపతిరావు పెళ్లి చేసుకోకుండా పిల్లలను పెంచి పోషించారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అయ్యారని తెలియజేశారు.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…