టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను శైలజ సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తీ సురేష్.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ని తన అందం, అభినయంతో మెప్పించింది..ఇక ఆ తర్వాత పలు సినిమాలో హీరోయిన్ గా మెరిసిన ఈ అమ్మడు మహానటి మూవీతో ఎనలేని క్రేజ్ తతెచ్చుకోవడమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది నితిన్ తో కల్సి నటించిన రంగ్ దే సినిమాతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ స్టార్ హీరోయిన్ తొలి సంపాదన కేవలం 500 రూపాయలు కావడం విశేషం.చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా అవతారం ఎత్తిన కీర్తి సురేష్ తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. పైగా ఈమె పేరెంట్స్ సినిమా రంగానికి చెందిన వారు కావడంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు ఈజీగానే వస్తున్నాయి.
చిన్నప్పుడు సినిమాల్లో నటించిన సమయంలో నిర్మాతలు ఇచ్చిన కవర్ ను డాడీకి ఇచ్చే దానినని కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆ సమయంలో తనకు నిర్మాతలు ఎంత ఇచ్చారనే విషయం అస్సలు తెలియదని చెప్పింది.అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో షోలలో పాల్గొన్నానని ఆ సమయంలో తనకు 500 రూపాయలు ఇచ్చారని అదే తన తొలి పారితోషికం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
అలా వచ్చిన 500 రూపాయలను కూడా నాన్నకే ఇచ్చేశానని, ఎందుకంటే నాన్నకు అలా డబ్బులు ఇవ్వడం తనకు సెంటిమెంట్ గా ఉండేదని వివరించింది. అయితే ప్రస్తుతం 2 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కి ఎదిగింది..ఇక మహేష్ బాబు కి జోడిగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దశలో ఉంది.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు… !!
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…