Featured

కరోనా సమయంలో.. తల్లి కొడుకులు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఏ విధమైనటువంటి ప్రళయం సృష్టిస్తోందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ కావడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా మారారు. మరెందరో అనాధలు తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ గొప్ప మనసుతో ముందుకొచ్చి తమ వంతు సాయంగా కరోనా బాధితులకు వీలైనంత సహాయం చేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే ఈ తల్లి కొడుకు.

కరోనా సమయంలో ఎంతో మంది అనాధలకు ఉచిత భోజనం పెడుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ముంబయికి చెందిన హర్ష్ మాండవియా, అతడి తల్లి హీనా మాండవియా నిరాశ్రయులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ తల్లి కొడుకులు ఇప్పటివరకు 22,000 మీల్స్, 55 వేల రొట్టెలు, 6 వేల స్వీట్లు అందించారు. హర్ష్ చిన్న వయసులోనే తండ్రి పోవడంతో ఎంతో మంది అపరిచితుల సహాయం వల్ల హోటల్ నడుపుతూ ఎంతో స్థాయికి ఎదిగిన వీరు ప్రస్తుత పరిస్థితులలో మరెందరికో సహాయం చేస్తూ ఆదర్శంగా నిలబడ్డారు.

2003లో కస్టమర్ల సహాయంతో ఈ తల్లి,కొడుకులు తమ వ్యాపారాన్ని విస్తరించారు. కొంతమంది వినియోగదారులు 70వేల డిపాజిట్ చేయగా దాంతో వారి వ్యాపారం విస్తరించుకున్నారు. వీరి వ్యాపారం బాగా పుంజుకున్న తర్వాత వారి డబ్బులు వారికి తిరిగి చెల్లించాలని పోతే అందుకు వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి రావడంతో ఈ తల్లి కొడుకులు మానవతా దృక్పథంతో ప్రతిరోజు నిరాశ్రయులకు 100-150 మందికి ఉచిత భోజనాలను అందిస్తున్నారు.

ఈ విధంగా నిరాశ్రయులకు ఉచిత భోజనాన్ని అందించడంతో ఎంతో మంది దాతలు వీరికి విరాళాలను ప్రకటించారు. రెండవ దశ కరోనా ప్రారంభమైనప్పుడు కేవలం రెండు రోజుల్లోనే వీరికి రూ.1.5 లక్షల విరాళాలు అందాయని హర్ష్ తెలిపారు. ఇప్పటి వరకు 22వేల మీల్స్, 55 వేల రొట్టెలు, 6 వేల స్వీట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. వృద్ధులకు భోజనం పెడుతున్నప్పుడు, వారు అందించే దీవెనలు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ఈ విధంగా తల్లి కొడుకుల తమ వంతు సాయంగా చేస్తున్న ఈ పనిపై ఎందరో ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

10 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

11 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

18 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

19 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

19 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago