సాధారణంగా కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో దారుణాలకు కారణమవుతాయి. తాజాగా అనుకోకుండా భార్య మద్యం గ్లాసు కింద పడడంతో దీంతో ఆగ్రహం చెందిన భర్త.. మహిళ పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తరప్రదేశ్లోని ఖేరి జిల్లాలో నిఘాసాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్పూర్ దులాహి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో గీతా దేవి, రమేష్ కుమార్ నిషాద్ దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి నిషాద్ మద్యం తాగే గ్లాస్ అనుకోకుండా గీత కింద పడేసింది. దీంతో ఆగ్రహం చెందిన నిషాద్ తన భార్యతో గొడవకు దిగాడు.
అప్పటి గొడవ సద్దుమణిగిన అర్ధరాత్రి ఈ విషయం గురించి మరోసారి తీవ్రంగా గొడవ పడ్డారు. వీరి ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో నిషాద్ గీత తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో గీత గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసే సమయానికి గీతా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న సమయంలో తన భర్త పరారీలో ఉండగా గీత మృతి చెంది కనిపించింది.అతనిపై 302 సెక్షన్ హత్య నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. అదేవిధంగా గీతను చంపడానికి ఉపయోగించిన కర్రను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…