KGF2 : కేజిఎఫ్ కోసం యశ్, ప్రశాంత్ నీల్, రవీనా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
KGF 2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.సినిమా విడుదలై 10 రోజులు పూర్తిచేసుకోగా ఇప్పటికే 850 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా వేయి కోట్లను క్రాస్ చేస్తుందని చెప్పవచ్చు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో నటించిన యశ్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి వంటి పలువురు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులు ఏ మేరకు పారితోషకం తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ ఈ సినిమా కోసం 30 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా రవీనాటాండన్ భారత ప్రధాని రమికా సేన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటించినందుకు గాను ఈమె 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెగటివ్ రోల్ కోసం రూ.9 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
రీనా దేశాయ్ పాత్రలో మోడల్ మరియు నటి శ్రీనిధి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారు. ఈ పాత్రలో నటించినందుకు ఈమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విజయేంద్ర ఇంగలగి పాత్రను పోషించాడు. దీని కోసం అతను రూ. 80-82 లక్షలు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించిన ప్రశాంత్ నీల్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…