KGF2 : కేజిఎఫ్ కోసం యశ్, ప్రశాంత్ నీల్, రవీనా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
KGF 2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.సినిమా విడుదలై 10 రోజులు పూర్తిచేసుకోగా ఇప్పటికే 850 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా వేయి కోట్లను క్రాస్ చేస్తుందని చెప్పవచ్చు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో నటించిన యశ్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి వంటి పలువురు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులు ఏ మేరకు పారితోషకం తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ ఈ సినిమా కోసం 30 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా రవీనాటాండన్ భారత ప్రధాని రమికా సేన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటించినందుకు గాను ఈమె 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెగటివ్ రోల్ కోసం రూ.9 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
రీనా దేశాయ్ పాత్రలో మోడల్ మరియు నటి శ్రీనిధి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారు. ఈ పాత్రలో నటించినందుకు ఈమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విజయేంద్ర ఇంగలగి పాత్రను పోషించాడు. దీని కోసం అతను రూ. 80-82 లక్షలు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించిన ప్రశాంత్ నీల్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…