KGF 2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.సినిమా విడుదలై 10 రోజులు పూర్తిచేసుకోగా ఇప్పటికే 850 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా వేయి కోట్లను క్రాస్ చేస్తుందని చెప్పవచ్చు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో నటించిన యశ్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి వంటి పలువురు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులు ఏ మేరకు పారితోషకం తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ ఈ సినిమా కోసం 30 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా రవీనాటాండన్ భారత ప్రధాని రమికా సేన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటించినందుకు గాను ఈమె 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెగటివ్ రోల్ కోసం రూ.9 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
విజయేంద్ర ఇంగలగి పాత్రలో ప్రకాష్ రాజ్..
రీనా దేశాయ్ పాత్రలో మోడల్ మరియు నటి శ్రీనిధి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారు. ఈ పాత్రలో నటించినందుకు ఈమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విజయేంద్ర ఇంగలగి పాత్రను పోషించాడు. దీని కోసం అతను రూ. 80-82 లక్షలు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించిన ప్రశాంత్ నీల్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.



































