కొన్ని వందల సంవత్సరాల నుంచి మహిళలు గాజులు వేసుకోవడం అనే సాంప్రదాయం కొనసాగుతోంది. చేతినిండా గాజులు వేసుకుంటే మహిళలు ఎంతో అందంగా కనిపిస్తారు. కాలం మారే కొద్దీ కొత్తకొత్త డిజైన్లతో గాజులు అందుబాటులోకి వస్తూ ఉండటంతో వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు గాజులు ధరించడాన్ని ఇష్టపడుతున్నారు. అయితే మహిళలు గాజులు ధరించడం వెనుక శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి.
మన దేశ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళలు గాజులు వేసుకుంటే భర్త, పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. గాజు కొత్తవి వేసుకునే సమయంలో సైతం కొత్త గాజులను వేసుకున్న తరువాతే పాత గాజులను పగలగొట్టాలి. గాజులు వేసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అందువల్లే పెద్దలు గాజులు వేసుకోకుండా చేతులను ఉంచకూడదని చెబుతూ ఉంటారు.
మనిషి చేతి మణికట్టు నిరంతరం ఏదో ఒక పనిని చేస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలు వంట పని కోసం చేతులతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మహిళలు గాజులు వేసుకోవడం వల్ల గాజుల ఘర్షణ రక్తప్రసరణను పెంచడంతో పాటు శరీరంలో లోపల ఉన్న శక్తిని బయటకు పోకుండా చేస్తుంది. గాజుల సవ్వడి కడుపులోని బిడ్డకు వినికిడి సామర్థ్యాన్ని పెంచుతుంది.
మహిళలు ఎవరైతే మట్టిగాజులు వేసుకుంటారో వారు చురుకుగా ఉంటారని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. గాజులు మహిళల్లో సున్నితత్వాన్ని, ఓదార్పును పెంచుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహిళలు ఎక్కువగా ఎరుపు, పచ్చ రంగు గాజులు ధరిస్తూ ఉంటారు. ఈ రంగుల గాజులు శాంతియుతంగా, శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…