సినీరంగంలో కొన్ని పాత్రలకు కొంతమంది నటీనటులు మాత్రమే సరిపోతారు.అలాంటి పాత్రలలో వారు నటిస్తే ప్రేక్షకులు హర్షిస్తారు. ఆ తరహా పాత్రలో ముఖ్యమైనది “పోలీస్ పాత్ర” ఈ మధ్య కాలంలో పోలీస్ పాత్ర లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 1980 చివరి దశకంలో పోలీస్ కథతో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
శారద ప్రధానపాత్రలో ఓ సినిమా నిర్మించాలనుకున్న డి.రామానాయుడు పరుచూరి బ్రదర్స్ కు చెప్పడంతో వారు “ప్రతిధ్వని” లాంటి పవర్ ఫుల్ కథను తయారు చేయడం జరిగింది.అది రామానాయుడుకు నచ్చడంతో శారదతో “ప్రతిధ్వని” చిత్రం నిర్మించారు.
1986 సురేష్ ప్రొడక్షన్స్, డి.రామానాయుడు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో “ప్రతిధ్వని” చిత్రం విడుదలైంది. శారద ప్రధాన పాత్రలో నటించగా.. అర్జున్, రజిని హీరో, హీరోయిన్ గా నటించారు. ఊర్వశి శారద పోలీస్ పాత్రలో విజృంభించగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా చూసిన “సూర్య మూవీస్” అధినేత ఏ.ఎమ్. రత్నం…కిరణ్ బేడీ జీవితం ఆధారంగా విజయశాంతికి ఒక కథ రాయాలని పరుచూరి సోదరులను కోరడం జరిగింది. కొంత సమయం తీసుకొని వారు ఓ అద్భుతమైన పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని రాయడం జరిగింది. ఆ స్టోరీ ఏ.ఎం.రత్నం, మోహన్ గాంధీలకు నచ్చడంతో విజయశాంతితో సినిమా తీయడానికి సంసిద్ధులు అయ్యారు.
పరుచూరి బ్రదర్స్ అప్పటికీ ఆంధ్రాలో ఓ పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్ జీవితం ఆధారంగా వినోద్ కుమార్ పాత్రను తయారు చేశారు. విజయశాంతికి దీటుగా సరికొత్త విలనిజాన్ని పండించడానికి మొదటగా పరుచూరి గోపాలకృష్ణను అనుకున్నప్పటికీ ఆయన ఆ పాత్ర చేయడానికి నిరాకరించారు. అలా ఓ కొత్త వారిచే విలన్ పాత్ర చేయించాలనే ఉద్దేశంతో… ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్యను సంప్రదించారు. తొలుత ఆయన ఈ పాత్ర చేయడానికి నిరాకరించారు. కానీ దర్శకుడు ఏ.మోహన్ గాంధీ పట్టుబట్టడంతో చివరికి “కర్తవ్యం” చిత్రంలో పుండరీకాక్షయ్య విలన్ గా కనిపిస్తారు.
సమాజంలో అర్ధబలం, అంగబలం గల ఒక రాజకీయ నాయకుడి పాత్రలో పుండరీకాక్షయ్య అద్భుతంగా అభినయించారు. లెక్కకు మించిన బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. 1990లో కర్తవ్యం సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విజయశాంతికి జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…