Ntr: ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల సినిమాలకు సంబంధించిన విషయాలు లేదా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలియాలి అంటే కేవలం సినీ వారపత్రికలో మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాలలో అభిమానులకు తెలిసిపోతుంది. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలందరూ కూడా వారికి సంబంధించిన విషయాలతో పాటు వారి చిన్నప్పటి విషయాలను కూడా అందరితో పంచుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఓల్డ్ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ మీద ఒక కుర్రాడు కూర్చొని ఉన్నటువంటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు అయితే ఆ హీరో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్నారు.
మరి ఎన్టీఆర్ దగ్గర కూర్చుని ఉన్నటువంటి ఆ కుర్రాడిని ఎవరో గుర్తుపట్టారా… మన అక్కినేని వారసుడు అఖిల్. ఎన్టీఆర్ దగ్గర ఎంతో చనువుగా కూర్చుని ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులు అటు అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు అఖిల్ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తారక్ తో అఖిల్..
ఇక అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు అఖిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే ఈయన కెరియర్ లో ఇప్పటివరకు నటించిన సినిమాలేవి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. చివరిగా అఖిల్ ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…