తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. ఇది ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ మరియు ఇతర భాషల్లో కూడా రన్ అవుతోంది. తెలుగులో మాత్రం ఎండ్ కార్టు పడటానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో హౌజ్ లో ఉన్న వాళ్లతో బిగ్ బాస్ అంతక ముందు ఇచ్చిన టాస్క్ లు ఇస్తూ.. వాళ్లతో కామెడీ యాంగిల్ ను తీసుకొస్తున్నాడు.
ఈ క్రమంలో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ప్రతీ ఒక్కరూ టాస్క్ లను మరో సారి ఆడి.. చిన్న చిన్న గిఫ్ట్ లను గెలుచుకున్నారు. అందులో మొదటగా షణ్ముఖ్.. బెలూన్ లను ఊది.. అవి పగిలేవిధంగా చేసే టాస్క్ లో గెలుస్తాడు. అతడు ఆ టాస్క్ గెలిచిన తర్వాత ఒక కూల్ డ్రింక్ ను బహుమతిగా గెలుస్తాడు. ఇక రెండో టాస్క్ లో స్విమ్మింగ్ ఫూల్ లో లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ లో మానస్ గెలిచి.. చాక్లెట్లను బహుమతిగా గెలుస్తాడు. తర్వాత టాస్స్ లో సౌండ్స్ ను గుర్తించి రాయాలి.. ఈ టాస్క్ లో కామెడీ విపరీతంగా పండిందనే చెప్పాలి.
చివరగా రోప్ వేవ్స్ టాస్క్ ని సిరి, సన్నీ, ఇంకా షణ్ముక్ లతో ఆడించాడు. ఈటాస్క్ లో సిరి ముందుగానే చేతులు నొప్పి పుట్టి వదిలేసింది. ఆ తర్వాత షణ్ముక్ అండ్ సన్నీ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా చాలా సీరియస్ గా ఈ టాస్క్ ఆడారు. అయితే చివరి వరకు ఉన్న సన్నీ.. మధ్యలో ఆ తాడుతో వేవ్స్ రాకపోవడంతో సిరి బయట నుంచి కామెంట్ చేయడం మొదలుపెట్టింది. అయినా చివరకు సన్నీ విన్నర్ అయ్యాడు. ఇక్కడ సిరికి మరియు సన్నీకి మధ్య వాగ్వాదం పెరిగింది. నువ్వు గేమ్ గెలిచావ్ కానీ, వేవ్స్ రాలేదు అంటూ మాట్లాడింది.
సన్నీ నువ్వు ఓడిపోయావ్ కదా అంటూ మాట్లాడేసరికి ఓడిపోయావ్ అని అనొద్దని సీరియస్ గా చెప్పింది సిరి. జోక్ గా అన్నాను మచ్చా అన్నా గానీ ఆ వ్యవహారం తెగలేదు.. ఒకరిపై ఒకరూ దూషించుకుంటూ హౌజ్ అంతా రచ్చ రచ్చ చేశారు. సిరి చాలా వరకు సన్నీతో కోపంగా మాట్లాడింది. నువ్వు ఏమన్నా హీరో అనుకుంటున్నావా అంటూ రెచ్చిపోయింది. ఇక షణ్ముఖ్ విన్నర్ కాడనే కారణంగానే సన్నీతో ఆమె ఎక్కువగా వాదన చేసుకుంటుందనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కావాలనే సన్నీని రెచ్చగొడుతుందనేది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…