సాధారణంగా మనలో చాలామంది మన ఇంటిలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా చాలా మంది ఎక్కువగా పెంపుడు జంతువులుగా కుక్కలని పెంచుకోవడం చూస్తుంటాము. ఈ విధంగా వారు ఎంతో ఇష్టంగా పెంచుకొనే పెంపుడు కుక్కల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. వాటిని ఒక జంతువు మాదిరి కాకుండా సొంత కుటుంబంలోని సభ్యులుగా భావించి వాటి ఆలనాపాలన చూసుకుంటూ ఉంటారు.
ఈ విధంగా పెంపుడు జంతువుల పట్ల మనం ఎంత అభిమానం చూపిస్తామో అవి కూడా మన పట్ల అంతే విశ్వాసం చూపిస్తాయి.ఈ విధమైన విశ్వాసం చూపుతూ తమ కుటుంబ సభ్యులను ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడేసిన సంఘటనలను గురించి మనం చాలానే విన్నాం. అచ్చం అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది.
సాధారణంగా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కొద్దిరోజుల పాటు వారి గురించి బాధపడి తర్వాత ఎవరి పనులలో వారు నిమగ్నమవుతారు. కానీ ఒక శునకం మాత్రం తన యజమాని పట్ల చూపించిన విశ్వాసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను ఎంతో అపురూపంగా చూసుకునే యజమాని చనిపోవడం వల్ల ఆ శునకం బాధ వర్ణనాతీతంగా మారింది.
కేరళ మలప్పురంలో నివసించే యజమానురాలు చనిపోవడంతో ఆమె ఎంతో ఇష్టంగా చూసుకున్న శునకం నిత్యం ఆమె ఫోటో ముందు నిలబడి విలపిస్తోంది. తన యజమానురాలు మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆమెను తలుచుకొని ప్రతి రోజు తన ఫోటో ముందు నిలబడి ఫోటోను చూస్తూ అరుస్తూ ఉంది. ఈ విధంగా ఒక శునకం తన యజమాని పట్ల చూపించే ప్రేమకు, విశ్వాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…