సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్ళినపుడు ఆకు కూరలు ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తే వాటిని కొనకుండా ఇంటికి వెళ్ళము. మార్కెట్లో ఎంతో ఫ్రెష్ గా కనిపించే ఆకుకూరలను ఇంటికి తెచ్చుకొని అవి అంతే తాజాగా ఉండాలని వాటిని పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో నిల్వ ఉంచుకుంటారు. ఫ్రిడ్జ్ లేనివారు తడిగుడ్డలో ఆకుకూరలను నిల్వ చేసుకుంటారు. అయితే ఈ వ్యక్తి ఆకుకూరలను తాజాగా నిల్వ ఉంచడం కోసం చేస్తున్న పని చూస్తే ఎంతో షాక్ అవుతారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి వాడిపోయిన ఆకుకూరలను ఒక రసాయన ద్రావణంలో ముంచి వాటిని తాజాగా చేస్తున్నాడు. వాడిపోయిన ఆకుకూరలను ఆ ద్రావణంలో ముంచగానే అవి ఎంతో తాజాగా మారిపోతున్నాయి.ఈ విధంగా వాడిపోయిన ఆకుకూరలను తాజాగా చేయడంతో ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు కామెంట్లు చేయగా..ఆహార విషయంలో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ విధంగా ఆకుకూరలను రిఫ్రెష్ చేసే లిక్విడ్ వల్ల అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కనుక ఆకుకూరలను కొనుగోలు చేసేవారు వీలైనంతవరకు తగిన జాగ్రత్తలను పాటిస్తూ కొనుగోలు చేయడం మంచిది. కనుక ఇకపై ఆకుకూరలు కొనుగోలు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు చేయడంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…