ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరి వ్యక్తులను రాత్రి సమయంలో అతికిరాతంగా నరికి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒక్కసారిగా సీమలో జంట హత్య కలకలం రేపింది.
స్థానికంగా ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందో తెలుసుకునే లోపే రెండు హత్యలు జరిగాయి. కర్నూలు జిల్లా సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు వెలుగోడులో నివాసం ఉంటున్నారు. అయితే మల్లికార్జున్ దగ్గర గత కొన్నేళ్ల నుంచి ఓబులేసు అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
అతడు ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్లికార్జున రెండో భార్య చిన్నిని, ఓబులేసును ఎవరో దుండగులు అతికిరాతంకంగా హత్య చేసి పారిపోయారు. దీనికి సూత్రదారి మల్లికార్జున్ తండ్రే అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఈ హత్యలకు అక్రమ సంబంధం కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యలకు మల్లికార్జున్ తండ్రితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…