Dulquer Salmaan:మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా అనంతరం ఈయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్
తెలుగులో మరొక అవకాశాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు పూర్తి అయ్యాయని త్వరలోనే అధికారక ప్రకటన రానుందని సమాచారం.
దుల్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ధనుష్ హీరోగా సార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టు గురించి దుల్కర్ సల్మాన్ ను కలిసి కథ వినిపించగా కథ నచ్చడంతో దుల్కర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇలా దుల్కర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాని బడా బ్యానర్ నిర్మించబోతుందని సమాచారం.ఇక ఈ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటన తెలియజేయబోతున్నారు.ప్రస్తుతం మలయాళంలో సొంత నిర్మాణంలో దుల్కర్ ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల అనంతరం తిరిగి వెంకీ అట్లూరి సినిమాలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…