ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైన ఫుడ్ ఫాస్ట్ ఫుడ్. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫాస్ట్ ఫుడ్ కి ఎక్కువగా అలవాటు పడ్డారు.కొందరు అయితే రోజుకు ఒక్కసారైనా బయట ఫుడ్ తినకుండా ఉండలేక పోతున్నారు అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ కి ఎంత అలవాటు పడ్డారో మీరే అర్థం చేసుకోవచ్చు.అలా ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ కు ఎడిక్ట్ అయ్యారు.
అయితే ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని తెలిసి కూడా చాలా మంది వాటిని తినడం ఆపలేకపోతున్నారు. తరచూ ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, చిప్స్ వంటివి ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిజ్జాలు, చిప్స్ తినడం వల్ల రక్తపోటు, షుగర్, బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను ప్రచురించడం జరిగింది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, నిల్వ పదార్థాలు, ఫ్లేవర్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెమొరీ లాస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన పదార్థాలతో పిజ్జాలు, ఇతర జంక్ ఫుడ్స్ ను తయారు చేయడం జరుగుతుంది. ప్రాసెస్ చేయబడిన మాంసం, శుద్ధి చేసిన పిండి తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఇక ఈ విషయాలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపి వెల్లడించారు. ఈ తరహా ఆహారం తిన్న ఎలుకలలో మెదడు పనితీరు మందగించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ సీనియర్ పరిశోధకులు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తిన్నవాళ్లు ఉన్నట్లుండి అన్నీ మరిచిపోతున్నారని వెల్లడించారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఇష్టపడేవాళ్లు ఆ ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. ఇక ఇలాంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.
తూర్పు ముఖ ఇల్లు ఎందుకు ప్రత్యేకం? వాస్తు, ప్రకృతి చెప్పే విశేషాలు కొత్త ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా, అద్దెకు వెళ్లాలనుకున్నా…
సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని, వారితో మాట్లాడాలని అభిమానుల్లో ఉండే ఆసక్తి కొత్తది కాదు. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి ఎవరు…
మైత్రీవనం లోని నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు…
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ముఖంపై మొటిమలు ఒకటి. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా…
భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. విదేశీ…
తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…