కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ లో ఆదివారం నుంచి ప్రారంభం అయింది. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి హాట్ సీటులో కూర్చున్నారు. ఆర్ఆర్ ఆర్ హీరోలు ఇద్దరూ రావడంతో ఫస్ట్ ఎపిసోడ్పై అంచనాలు పెరిగిపోయాయి. దీనిని త్రివిక్రమ్, కళ్యాణ్ కృష్ణ కురసాల లాంటి దర్శకులు తెరకెక్కించారు. వీటికి సంబంధించి ఎట్రీలను ఈ సంవత్సరం మార్చిలోనే తీసుకున్నారు.
కానీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ సీజన్ కోసం దాదాపు 13 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో నాలెడ్జ్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోను కూడా భారీ స్థాయిలో లాంఛ్ చేశారు. దీనిలోనే ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ ఆసక్తిగా సమాధానాలు చెప్పారు.
దీనిలో ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలను కూడా అడిగారు. ఈ సందర్భంగా అతడు తన దగ్గర ఆరు కుక్కలు ఉన్నాయని.. మరో వైపు గుర్రాలను పెంచుకోవడం అంటే ఎంతో సరదా అన్నారు రామ్ చరణ్. మగధీర సినిమాలో ఓ గుర్రాన్ని రామ్ చరణ్ బాద్ షా అంటూ పిలవడం మనం చూశాం. అతడు పెంచుకుంటున్న గుర్రాల్లో అది కూడా ఒకటి ఉందని చెప్పారు. మరోవైపు ఓ స్నేహితుడు అతను చనిపోయే ముందు తనకు మరో గుర్రాన్ని ఇచ్చాడు. దానికి కాజల్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చారు.
మగధీర రిలీజయ్యాక అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందంటూ నవ్వులు పూయించారు రామ్ చరణ్. రామ్ చరణ్ బోర్ గా ఫీలయినప్పుడల్లా అదుర్స్ సినిమా చూస్తూ ఉంటారని.. అందులో ఎన్టీఆర్ కామెడీ అదుర్స్ అంటూ మెచ్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజుగా నువ్వు.. కొమరం భీమ్గా నేను ఎంత కష్టపడ్డామో తెలుసుగా.. అలాంటి గొప్ప యోధుల పాత్రల్లో నటించడం మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు.
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…